హౌతీ తీవ్రవాదుల దాడి: నలుగురు పౌరులకు గాయాలు
- March 02, 2021
రియాద్:హౌతీ మిలీషియా జరిపిన దాడిలో నలుగురు పౌరులకు గాయాలైనట్లు సౌదీ అరేబియా సివిల్ డిఫెన్స్ వెల్లడించింది. సౌదీ అరేబియాలోని దక్షిణ ప్రాంతంలోని జజాన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ మేరకు సివిల్ డిఫెన్స్ డైరెక్టరేట్ (జజాన్ ప్రాంతం) ప్రతినిథి కల్నల్ ముహమ్మద్ అల్ గామ్ది ఓ ప్రకటన విడుదల చేశారు. ముగ్గరు సౌదీ పౌరులు, ఇద్దరు యెమనీలు ఈ దాడిలో ఘాయపడగా వారిని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. రెండు ఇళ్ళు ఈ ఘటనలో ధ్వంసమయ్యాయి. ఓ గ్రాసరీ స్టోర్ కూడా ధ్వంసమైంది. అరబ్ సంకీర్ణదళం హౌతీ తీవ్రవాదులతో నిత్యం పోరాడుతున్న సంగతి తెలిసింది. యెమెన్లో శాంతి కోసం సంకీర్ణ దళం పనిచేస్తోంది.
తాజా వార్తలు
- నాలుగో అత్యంత విలువైన సంస్థగా SBI
- కెనడా స్కూల్లో కాల్పులు..10 మంది మృతి
- BHELలో 5 శాతం వాటాల విక్రయం..
- పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్: మునిసిపల్ ఎన్నికల్లో ఆ పార్టీ దే హవా!
- తెలంగాణ: మున్సిపల్ పోలింగ్ ముగిసింది
- సామాజిక రక్షణ పథకాల కవరేజ్ గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపి బాలశౌరి
- అమెరికా ప్రభుత్వానికి భారత్ తలొగ్గింది..రాహుల్గాంధీ
- రేపు భారత్ బంద్..
- ఆంధ్రప్రదేశ్: మార్చి 6 వరకు అసెంబ్లీ సమావేశాలు
- జీసీసీ కీలక కస్టమ్స్ అథారిటీ సమావేశం..కీలక సమీక్షలు..!!









