హౌతీ తీవ్రవాదుల దాడి: నలుగురు పౌరులకు గాయాలు

- March 02, 2021 , by Maagulf
హౌతీ తీవ్రవాదుల దాడి: నలుగురు పౌరులకు గాయాలు

రియాద్:హౌతీ మిలీషియా జరిపిన దాడిలో నలుగురు పౌరులకు గాయాలైనట్లు సౌదీ అరేబియా సివిల్ డిఫెన్స్ వెల్లడించింది. సౌదీ అరేబియాలోని దక్షిణ ప్రాంతంలోని జజాన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ మేరకు సివిల్ డిఫెన్స్ డైరెక్టరేట్ (జజాన్ ప్రాంతం) ప్రతినిథి కల్నల్ ముహమ్మద్ అల్ గామ్ది ఓ ప్రకటన విడుదల చేశారు. ముగ్గరు సౌదీ పౌరులు, ఇద్దరు యెమనీలు ఈ దాడిలో ఘాయపడగా వారిని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. రెండు ఇళ్ళు ఈ ఘటనలో ధ్వంసమయ్యాయి. ఓ గ్రాసరీ స్టోర్ కూడా ధ్వంసమైంది. అరబ్ సంకీర్ణదళం హౌతీ తీవ్రవాదులతో నిత్యం పోరాడుతున్న సంగతి తెలిసింది. యెమెన్‌లో శాంతి కోసం సంకీర్ణ దళం పనిచేస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com