‘జాతిరత్నాలు’ ట్రైలర్ విడుదల చేసిన ప్రభాస్
- March 04, 2021
హైదరాబాద్:‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమా’తో తెలుగులో అరంగేట్రం చేసిన నవీన్ తన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తాజాగా నవీన్ పోలిశెట్టి నటిస్తున్న తాజా చిత్రం ‘జాతి రత్నాలు’. ఈ సినిమా ఈ నెల11న విడుదల కానుంది. కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లాహ్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమాలో ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాను అనుదీప్ దర్శకత్వంలో నాగ్ అశ్విన్ నిర్మిస్తున్నారు.
అయితే ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు, టీజర్, పాటలు అన్నీ కూడా సినిమాపై అంచనాలను పెంచేశాయి. తాజాగా ‘జాతి రత్నాలు’ ట్రైలర్ను పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ విడుదల చేశారు. కాగా ఈ ట్రైలర్ విడుదల కోసం ముంబైలో ఉన్న ప్రభాస్ ను కలవడానికి వెళ్ళింది చిత్రబృందం. ఈ సందర్భంగా వారితో ప్రభాస్ సరదాగా కాసేపు గడిపారు. ప్రభాస్ మాట్లాడుతూ.. ‘ట్రైలర్ నాకు బాగా నచ్చింది. ట్రైలర్ తోనే ఇంత నవ్వుకున్నానంటే సినిమా చూస్తే ఎలా ఉంటాడో ఊహించగలను’ అంటూ చెప్పుకొచ్చారు. మరి ఆ ట్రైలర్ పై మీరు ఓ లుక్కేయండి.
తాజా వార్తలు
- 'రాయల్' ఫోటోగ్రాఫర్ రమేష్ శుక్లాకు షేక్ హమ్దాన్ నివాళి..!!
- ఒమన్ లో పోలీసుల అధికారిక వర్కింగ్ అవర్స్ ఇవే..!!
- సౌదీలో డొమెక్టిక్ వర్కర్స్ తొలగింపునకు అనుమతి..!!
- బహ్రెయిన్ వార్షిక ఫైన్ ఆర్ట్స్ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- ఖతార్ లో ఆహార సంస్థల పై నిఘా ముమ్మరం..!!
- రమదాన్..మస్జీదులలో కె-నెట్ పరికరాలపై నిషేధం..!!
- అమెరికా, ఇజ్రాయెల్ మధ్య కీలక పొలిటికల్ హామీ
- SBI ఇన్సూరెన్స్ స్కీం: ₹3,000 ప్రీమియంతో ₹60 లక్షల ప్రమాద బీమా
- JEE మెయిన్ 2026 ఫైనల్ కీ విడుదల
- వాణిజ్య ఒప్పందాలతో కొత్త ఆర్థిక యుగం









