కోవిడ్ రూల్స్ బ్రేక్ చేసిన 8 మందికి జైలుశిక్ష

- March 05, 2021 , by Maagulf
కోవిడ్ రూల్స్ బ్రేక్ చేసిన 8 మందికి జైలుశిక్ష

మస్కట్:కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన 8 మందికి జైలు శిక్ష, జరిమానా విధించింది కోర్టు. భౌతిక దూరం పాటించకపోవటం, క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘించిన కేసులో నిందితులను వేర్వేరు కోర్టులలో హజరు పరిచారు. విచారణ చేపట్టిన బాటినా, బురైమి కోర్టులు...నిందితులకు ఆరు నెలల జైలు శిక్ష, 500 రియాల్స్ జరిమానా విధిస్తూ తీర్పునిచ్చాయి. కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు ఏర్పాటైన సుప్రీం కమిటీ సూచనలను ప్రజలు అంతా తప్పనిసరిగా పాటించాలని, లేదంటే జరిమానాతో పాటు జైలు శిక్ష ఎదుర్కొవాల్సి వస్తుందని పోలీసులు హెచ్చరించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com