యూఏఈ:ఇక ఇంటి దగ్గరే ఉచితంగా పీసీఆర్ టెస్టులు
- March 05, 2021
యూఏఈ:ప్రజల ఆరోగ్య భద్రత కోసం, కోవిడ్ ముప్పును సాధ్యమైనంత తగ్గించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్న యూఏఈ లేటెస్ట్ గా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఓ వైపు వ్యాక్సినేషన్ను ముమ్మరం చేస్తూనే మరోవైపు వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఇంటి దగ్గరే ఉచితంగా పీసీఆర్ టెస్టులను నిర్వహించబోతోంది. ఇందులో కోసం ప్రత్యేక వైద్య సిబ్బందిని ఏర్పాటు చేసింది. పీసీఆర్ టెస్టుల కోసం వైద్య కేంద్రాలకు తరలిరాటం వల్ల ప్రజల సమయం వృద్ధా అవటంతో పాటు ఇతరులకు వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు కూడా ఎక్కువే. దీంతో ఇంటి దగ్గరే ఉచితంగా పీసీఆర్ టెస్టులు నిర్వహించేందుకు సిద్ధమైంది. అయితే..వృద్ధులు, దీర్ఘకాలిక రోగులు, ఇతర వ్యాధులతో బాధపడే వారికి అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ప్రజలు తమ ఆరోగ్యాన్ని రక్షించుకోవటంతో పాటు తోటి వారి ఆరోగ్య భద్రతకు సహకరించాలని, ఇంటి దగ్గర నిర్వహించే ఉచిత పీసీఆర్ టెస్ట్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







