యూఏఈ:ఇక ఇంటి దగ్గరే ఉచితంగా పీసీఆర్ టెస్టులు
- March 05, 2021
యూఏఈ:ప్రజల ఆరోగ్య భద్రత కోసం, కోవిడ్ ముప్పును సాధ్యమైనంత తగ్గించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్న యూఏఈ లేటెస్ట్ గా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఓ వైపు వ్యాక్సినేషన్ను ముమ్మరం చేస్తూనే మరోవైపు వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఇంటి దగ్గరే ఉచితంగా పీసీఆర్ టెస్టులను నిర్వహించబోతోంది. ఇందులో కోసం ప్రత్యేక వైద్య సిబ్బందిని ఏర్పాటు చేసింది. పీసీఆర్ టెస్టుల కోసం వైద్య కేంద్రాలకు తరలిరాటం వల్ల ప్రజల సమయం వృద్ధా అవటంతో పాటు ఇతరులకు వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు కూడా ఎక్కువే. దీంతో ఇంటి దగ్గరే ఉచితంగా పీసీఆర్ టెస్టులు నిర్వహించేందుకు సిద్ధమైంది. అయితే..వృద్ధులు, దీర్ఘకాలిక రోగులు, ఇతర వ్యాధులతో బాధపడే వారికి అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ప్రజలు తమ ఆరోగ్యాన్ని రక్షించుకోవటంతో పాటు తోటి వారి ఆరోగ్య భద్రతకు సహకరించాలని, ఇంటి దగ్గర నిర్వహించే ఉచిత పీసీఆర్ టెస్ట్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- 55 రోజుల తర్వాత కువైట్ విమానాశ్రయం పునఃప్రారంభం
- నకిలీ పెట్టుబడి, ట్రేడింగ్ మోసాల పై ప్రజలకు దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- పెట్రోల్ బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు కనిపించకూడదు: సీఎం చంద్రబాబు
- ఇరాన్ దాడి షాక్…అమెరికా స్థావరాలకు భారీ నష్టం
- చెన్నై పై గుజరాత్ ఘన విజయం
- కరీంనగర్ లో ఘనంగా కుబేర క్లాత్ షోరూం రెండో బ్రాంచ్ ప్రారంభం
- కువైట్లో ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో క్యాన్సర్ బాధిత కార్యకర్తకు ఆర్థిక సహాయం
- ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త వాసు ష్రాఫ్ కన్నుమూత
- 2025లో QR 20.98 బిలియన్ల ‘రియల్’ లావాదేవీలు..!!
- వాట్సాప్ ద్వారా డాక్యుమెంట్స్..యూఏఈలో నిషేధం..!!









