యూఏఈ:ఇక ఇంటి దగ్గరే ఉచితంగా పీసీఆర్ టెస్టులు
- March 05, 2021
యూఏఈ:ప్రజల ఆరోగ్య భద్రత కోసం, కోవిడ్ ముప్పును సాధ్యమైనంత తగ్గించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్న యూఏఈ లేటెస్ట్ గా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఓ వైపు వ్యాక్సినేషన్ను ముమ్మరం చేస్తూనే మరోవైపు వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఇంటి దగ్గరే ఉచితంగా పీసీఆర్ టెస్టులను నిర్వహించబోతోంది. ఇందులో కోసం ప్రత్యేక వైద్య సిబ్బందిని ఏర్పాటు చేసింది. పీసీఆర్ టెస్టుల కోసం వైద్య కేంద్రాలకు తరలిరాటం వల్ల ప్రజల సమయం వృద్ధా అవటంతో పాటు ఇతరులకు వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు కూడా ఎక్కువే. దీంతో ఇంటి దగ్గరే ఉచితంగా పీసీఆర్ టెస్టులు నిర్వహించేందుకు సిద్ధమైంది. అయితే..వృద్ధులు, దీర్ఘకాలిక రోగులు, ఇతర వ్యాధులతో బాధపడే వారికి అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ప్రజలు తమ ఆరోగ్యాన్ని రక్షించుకోవటంతో పాటు తోటి వారి ఆరోగ్య భద్రతకు సహకరించాలని, ఇంటి దగ్గర నిర్వహించే ఉచిత పీసీఆర్ టెస్ట్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- T20WorldCup2026: ఆస్ట్రేలియా ఇంటికే..!
- ఢిల్లీలో AI సమ్మిట్ ప్రారంభం
- కొత్తగా ఎన్నికైన మేయర్, డిప్యూటీ మేయర్లు వీళ్లే
- 'రాయల్' ఫోటోగ్రాఫర్ రమేష్ శుక్లాకు షేక్ హమ్దాన్ నివాళి..!!
- ఒమన్ లో పోలీసుల అధికారిక వర్కింగ్ అవర్స్ ఇవే..!!
- సౌదీలో డొమెక్టిక్ వర్కర్స్ తొలగింపునకు అనుమతి..!!
- బహ్రెయిన్ వార్షిక ఫైన్ ఆర్ట్స్ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- ఖతార్ లో ఆహార సంస్థల పై నిఘా ముమ్మరం..!!
- రమదాన్..మస్జీదులలో కె-నెట్ పరికరాలపై నిషేధం..!!
- అమెరికా, ఇజ్రాయెల్ మధ్య కీలక పొలిటికల్ హామీ









