'పేపాల్'లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- March 05, 2021డిజిటల్ పేమెంట్స్ ప్లాట్ఫామ్ కీలక ప్రకటన చేసింది.ఈ ఏడాది ప్రముఖ కాలేజీల నుంచి 1000 ఇంజనీర్లను రిక్రూట్ చేసుకోనున్నట్లు ప్రకటించింది. పేపాల్ సంస్థకు హైదరాబాద్, బెంగళూరు చెన్నైలలో డెవలప్మెంట్ సెంటర్లు ఉన్నాయి.ఈ సెంటర్లలో రిక్రూట్మెంట్స్ ఉంటాయని తెలిపింది. సాప్ట్వేర్, డేటా సైన్స్, ప్రొడక్ట్ డెవలప్మెంట్, బిజినెస్ అనలిటిక్స్ విభాగాల్లో ఇంజనీర్లను నియమించుకోనున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం పేపాల్ సంస్థలో మన దేశంలో 4500 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.
టైడ్-హైదరాబాద్లో 300 ఉద్యోగాలు
యూకే ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న డిజిటల్ పేమెంట్ ప్లాట్ఫామ్.ఈ నియామకాలను హైదరాబాద్ గ్లోబల్ డెవలప్మెంట్ సెంటర్లో రిక్రూట్ చేసుకోనున్నట్లు పేర్కొంది.మొత్తం 300 నియామకాల్లో 180 పోస్టులు ఇంజనీరింగ్, ప్రొడక్ట్ డెవలప్మెంట్ విభాగాల్లో ఉంటాయి. ఓ 50 మందిని గురుగ్రామ్ కేంద్రంలోని మార్కెటింగ్ విభాగంలో నియమిస్తామని పేర్కొంది. మిగిలిన వారిని వినియోగదారుల సహాయం కోసం తీసుకుంటామని వెల్లడించింది.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు