కేరళలో గోల్డ్ స్కామ్ ప్రకంపనలు..
- March 05, 2021
తిరువనంతపురం:కేరళ గోల్డ్ స్కామ్ ప్రకంపనలు పుట్టిస్తోంది.కోట్ల రూపాయల విలువజేసే భారీ గోల్డ్ స్కామ్ కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి.ఈ కుంభకోణంలో ప్రధాన నిందితురాలు స్వప్న సురేష్.. కేరళ సీఎం విజయన్పై సంచలన ఆరోపణలు చేసినట్లు వెల్లడించింది కస్టమ్స్ డిపార్ట్మెంట్.స్వప్న సురేష్ ఇచ్చిన ఆధారాలతో కేరళ హైకోర్టుకు అఫిడవిట్ సమర్పించనుంది.సీఎంతో పాటు ఆయన సన్నిహితులపైనా సంచలన ఆరోపణలు చేశారు స్వప్న సురేష్.
జులై 5న త్రివేండ్రం ఎయిర్పోర్ట్కు దుబాయ్ నుంచి వచ్చిన కార్గో విమానంలో 30 కేజీల బంగారం పట్టుబడింది.అప్పట్లో ఈ కేసు సంచలనం రేపింది.సాక్షాత్తూ సీఎం కార్యాలయం సిబ్బంది సాయంతోనే దుబాయ్ నుంచి త్రివేండ్రానికి బంగారం స్మగ్లింగ్ జరుగుతోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
స్మగ్లింగ్ కేసులో సూత్రధారిగా ఉన్న స్వప్న సురేశ్కు ప్రిన్సిపల్ సెక్రటరీ శివశంకర్ అండగా ఉన్నారని ఆరోపణలు వచ్చాయి.
తాజా వార్తలు
- ఫిబ్రవరి 23న తెలంగాణ క్యాబినెట్ భేటీ
- నాలుగు రాష్ట్రాల ఎన్నికలు ఏప్రిల్లోనా? షెడ్యూల్ పై క్లారిటీ
- విశాఖకు చేరుకున్న రాష్ట్రపతి ముర్ము
- ఎర్రవల్లి ఫామ్ హౌస్ వద్ద కార్యకర్తల సందడి
- పేరుకే ఏఐ సమ్మిట్.. నో యూపీఐ, నో కార్డ్.. ఓన్లీ క్యాష్
- శ్రీసిటీలో క్యారియర్ ఏసీ తయారీ యూనిట్ ప్రారంభం
- కోర్టు తీర్పు పై స్పందించిన ప్రత్యూష తల్లి
- ప్రధానిగా తారిక్ రెహమాన్ ప్రమాణ స్వీకారం
- ఐబొమ్మ’ రవికి బెయిల్ మంజూరు
- బడ్జెట్ తర్వాత భారీగా పెరిగిన ‘సిగరెట్’ ధరలు









