కేరళలో గోల్డ్‌ స్కామ్‌ ప్రకంపనలు..

- March 05, 2021 , by Maagulf
కేరళలో గోల్డ్‌ స్కామ్‌ ప్రకంపనలు..

తిరువనంతపురం:కేరళ గోల్డ్‌ స్కామ్‌ ప్రకంపనలు పుట్టిస్తోంది.కోట్ల రూపాయల విలువజేసే భారీ గోల్డ్‌ స్కామ్‌ కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి.ఈ కుంభకోణంలో ప్రధాన నిందితురాలు స్వప్న సురేష్‌.. కేరళ సీఎం విజయన్‌పై సంచలన ఆరోపణలు చేసినట్లు వెల్లడించింది కస్టమ్స్‌ డిపార్ట్‌మెంట్‌.స్వప్న సురేష్‌ ఇచ్చిన ఆధారాలతో కేరళ హైకోర్టుకు అఫిడవిట్‌ సమర్పించనుంది.సీఎంతో పాటు ఆయన సన్నిహితులపైనా సంచలన ఆరోపణలు చేశారు స్వప్న సురేష్‌.

జులై 5న త్రివేండ్రం ఎయిర్‌పోర్ట్‌కు దుబాయ్‌ నుంచి వచ్చిన కార్గో విమానంలో 30 కేజీల బంగారం పట్టుబడింది.అప్పట్లో ఈ కేసు సంచలనం రేపింది.సాక్షాత్తూ సీఎం కార్యాలయం సిబ్బంది సాయంతోనే దుబాయ్‌ నుంచి త్రివేండ్రానికి బంగారం స్మగ్లింగ్‌ జరుగుతోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

స్మగ్లింగ్‌ కేసులో సూత్రధారిగా ఉన్న స్వప్న సురేశ్‌కు ప్రిన్సిపల్‌ సెక్రటరీ శివశంకర్‌ అండగా ఉన్నారని ఆరోపణలు వచ్చాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com