కేరళలో గోల్డ్ స్కామ్ ప్రకంపనలు..
- March 05, 2021
తిరువనంతపురం:కేరళ గోల్డ్ స్కామ్ ప్రకంపనలు పుట్టిస్తోంది.కోట్ల రూపాయల విలువజేసే భారీ గోల్డ్ స్కామ్ కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి.ఈ కుంభకోణంలో ప్రధాన నిందితురాలు స్వప్న సురేష్.. కేరళ సీఎం విజయన్పై సంచలన ఆరోపణలు చేసినట్లు వెల్లడించింది కస్టమ్స్ డిపార్ట్మెంట్.స్వప్న సురేష్ ఇచ్చిన ఆధారాలతో కేరళ హైకోర్టుకు అఫిడవిట్ సమర్పించనుంది.సీఎంతో పాటు ఆయన సన్నిహితులపైనా సంచలన ఆరోపణలు చేశారు స్వప్న సురేష్.
జులై 5న త్రివేండ్రం ఎయిర్పోర్ట్కు దుబాయ్ నుంచి వచ్చిన కార్గో విమానంలో 30 కేజీల బంగారం పట్టుబడింది.అప్పట్లో ఈ కేసు సంచలనం రేపింది.సాక్షాత్తూ సీఎం కార్యాలయం సిబ్బంది సాయంతోనే దుబాయ్ నుంచి త్రివేండ్రానికి బంగారం స్మగ్లింగ్ జరుగుతోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
స్మగ్లింగ్ కేసులో సూత్రధారిగా ఉన్న స్వప్న సురేశ్కు ప్రిన్సిపల్ సెక్రటరీ శివశంకర్ అండగా ఉన్నారని ఆరోపణలు వచ్చాయి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







