ఇద్దరు ప్రయాణీకులకు మాత్రమే ట్యాక్సీలో అనుమతి

- March 05, 2021 , by Maagulf
ఇద్దరు ప్రయాణీకులకు మాత్రమే ట్యాక్సీలో అనుమతి

కువైట్ సిటీ:నెల రోజులపాటు కర్‌ఫ్యూని పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న కువైట్, వలసదారులపైన కూడా తాత్కాలిక బ్యాన్ విధించింది. కాగా, ట్యాక్సీల్లో ప్రయాణించే ప్రయాణీకుల విషయంలోనూ సరికొత్త నిబంధనలను అథారిటీస్ విధించడం జరిగింది. కేవలం ఇద్దరు ప్రయాణీకుల్ని మాత్రమే ట్యాక్సీలో అనుమతిస్తున్నట్లు పేర్కొన్నారు అధికారులు. కాగా, కరోనా నేపథ్యంలో అమలు చేసిన ఈ నిబంధన పట్ల ట్యాక్సీ ఓనర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రయాణీకులు సైతం, కుటుంబ సమేతంగా వెళ్ళాల్సి వస్తే ఈ నిబంధన తమకు ఇబ్బందికరంగా మారుతున్నట్లు అభిప్రాయపడ్డారు. క్యాబ్ ఓనర్లు తమ అభ్యంతరాల్ని ప్రభుత్వానికి విన్నవించుకున్నారు కూడా. అయితే, కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో మరోసారి నిబంధనల్ని కఠినతరం చేయక తప్పడంలేదు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com