ఇద్దరు ప్రయాణీకులకు మాత్రమే ట్యాక్సీలో అనుమతి
- March 05, 2021
కువైట్ సిటీ:నెల రోజులపాటు కర్ఫ్యూని పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న కువైట్, వలసదారులపైన కూడా తాత్కాలిక బ్యాన్ విధించింది. కాగా, ట్యాక్సీల్లో ప్రయాణించే ప్రయాణీకుల విషయంలోనూ సరికొత్త నిబంధనలను అథారిటీస్ విధించడం జరిగింది. కేవలం ఇద్దరు ప్రయాణీకుల్ని మాత్రమే ట్యాక్సీలో అనుమతిస్తున్నట్లు పేర్కొన్నారు అధికారులు. కాగా, కరోనా నేపథ్యంలో అమలు చేసిన ఈ నిబంధన పట్ల ట్యాక్సీ ఓనర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రయాణీకులు సైతం, కుటుంబ సమేతంగా వెళ్ళాల్సి వస్తే ఈ నిబంధన తమకు ఇబ్బందికరంగా మారుతున్నట్లు అభిప్రాయపడ్డారు. క్యాబ్ ఓనర్లు తమ అభ్యంతరాల్ని ప్రభుత్వానికి విన్నవించుకున్నారు కూడా. అయితే, కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో మరోసారి నిబంధనల్ని కఠినతరం చేయక తప్పడంలేదు.
తాజా వార్తలు
- తెలంగాణ: ఏసీ బస్సుల్లో 30 శాతం ఛార్జీల తగ్గింపు
- అమృత్ భారత్ 3.0 రైళ్లు త్వరలో ప్రారంభం
- చిలీతో భారత్ చేస్తున్న ఈ ‘ట్రేడ్ డీల్’ వెనుక ఉన్న వ్యూహం ఏమిటి?
- కువైట్లో ఫిబ్రవరి 25-26 తేదీలలో హాలీడే..!!
- నాసర్ బిన్ ఖలీద్ ఇంటర్ సెక్షన్ 5 గంటలపాటు మూసివేత..!!
- సౌదీ అరేబియా నేటి నుంచే రమదాన్ ప్రారంభం..!!
- నాన్ బహ్రెయిన్ ల నుండి BD3.99 మిలియన్ల ఫీ వసూలు..!!
- ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపిన సౌదీ అరేబియా..!!
- జెనీవాలో ఇరాన్-యూఎస్ మధ్య చర్చలు..!!
- ఫిబ్రవరి 23న తెలంగాణ క్యాబినెట్ భేటీ









