క్యాబ్లో నగదు గుర్తింపు: తిరిగిచ్చేసిన డ్రైవర్
- March 05, 2021
యూఏఈ:కరీమ్ డ్రైవర్ ఒకరు తన క్యాబ్లో ప్రయాణీకులు మర్చిపోయిన నగదును గుర్తించి వెంటనే, పోలీసులకు సమాచారం ఇచ్చారు.మొత్తం 900,000 దిర్హాముల నగదును ప్రయాణీకులు మర్చిపోవడం జరిగింది. బర్ దుబాయ్ పోలీస్ స్టేషన్కి సమాచారం ఇచ్చి, నగదును అప్పగించారు డ్రైవర్ మొహమ్మద్ అర్ఫాన్ మొహమ్మద్ రఫీక్. ఈ నేపథ్యంలో అత్యంత నీతివంతంగా వ్యవహరించిన డ్రైవర్ను సన్మానించింది దుబాయ్ పోలీస్. బ్రిగేడియర్ అబ్దుల్లా కరీమ్ సరూర్ (బర్ దుబాయ్ పోలీస్ స్టేషన్ డైరెక్టర్), డ్రైవర్పై ప్రశంసలు కురిపించారు. సర్టిఫికెట్ ఆఫ్ అప్రీషియేషన్తో డ్రైవర్ను సత్కరించారు. తనను సత్కరించిన పోలీసు వర్గాలకు కృతజ్ఞతలు తెలిపారు డ్రైవర్.
తాజా వార్తలు
- కువైట్లో ఫిబ్రవరి 25-26 తేదీలలో హాలీడే..!!
- నాసర్ బిన్ ఖలీద్ ఇంటర్ సెక్షన్ 5 గంటలపాటు మూసివేత..!!
- సౌదీ అరేబియా నేటి నుంచే రమదాన్ ప్రారంభం..!!
- నాన్ బహ్రెయిన్ ల నుండి BD3.99 మిలియన్ల ఫీ వసూలు..!!
- ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపిన సౌదీ అరేబియా..!!
- జెనీవాలో ఇరాన్-యూఎస్ మధ్య చర్చలు..!!
- ఫిబ్రవరి 23న తెలంగాణ క్యాబినెట్ భేటీ
- నాలుగు రాష్ట్రాల ఎన్నికలు ఏప్రిల్లోనా? షెడ్యూల్ పై క్లారిటీ
- విశాఖకు చేరుకున్న రాష్ట్రపతి ముర్ము
- ఎర్రవల్లి ఫామ్ హౌస్ వద్ద కార్యకర్తల సందడి









