భారత్ లో కరోనా కేసుల వివరాలు
- March 06, 2021
న్యూ ఢిల్లీ:భారత్ లో కరోనా తీవ్రత కొనసాగుతోంది.ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయి.తాజా బులెటిన్ ప్రకారం దేశంలో కొత్తగా 18,327 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో భారత్ లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,11,92,088 కి చేరింది.ఇందులో 1,08,54,128 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1,80,304 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.ఇక గడిచిన 24 గంటల్లో భారత్ లో 108 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,57,656 కి చేరింది. ఇక దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతున్నది. ఇప్పటి వరకు 1,94,97,704 మందికి వ్యాక్సిన్ ను అందించారు.దేశవ్యాప్తంగా రికవరీ రేటు 96.98 శాతం కాగా, మరణాల రేటు 1.41 శాతంగా నమోదైంది.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







