గల్ఫ్ దేశాలకు 68% ఫ్లైట్స్ కేటాయింపు
- March 06, 2021
కరోనా ప్రభావంతో పలు దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తరలిచేందుకు చేపట్టిన వందే భారత్ మిషన్ లేటెస్ట్ షెడ్యూల్ ను ప్రకటించింది ఇండియా ప్రభుత్వం. ఈ సారి విడతలో ప్రపంచవ్యాప్తంగా 28 దేశాల నుంచి ఇండియన్లను తీసుకువచ్చేందుకు 1,350 ఫ్లైట్స్ ను షెడ్యూల్ చేసినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ తెలిపారు. మార్చి 1 నుంచి 28 వరకు ఫ్లైట్స్ ను ఆపరేట్ చేస్తామని, ఈ సమయంలో దాదాపు 2,60,000 మంది స్వదేశానికి చేరుకునే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నట్లు వివరించారు. అయితే..మొత్తం 1,350 ఫ్లైట్స్ ని షెడ్యూల్ చేస్తే అందులో సగానికంటే ఎక్కువ జీసీసీ దేశాలకే కేటాయించారు. జీసీసీ దేశాలకు 920 ఫ్లైట్స్ ఆపరేట్ చేయనున్నారు. మొత్తం విమానాల్లో ఇది 68 శాతం. నార్త్ అమెరికా నుంచి 150 ఫ్లైట్స్, యూకే, యూరప్ నుంచి 120, అగ్నేయ ఆసియా దేశాల నుంచి 50 వందే భారత్ మిషన్ ఫ్లైట్లను నడపనున్నట్లు శ్రీవాత్సవ వివరించారు.
తాజా వార్తలు
- మానవ అక్రమ రవాణా కేసు అప్పీల్పై విచారణ వాయిదా...!!
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..







