గల్ఫ్ దేశాలకు 68% ఫ్లైట్స్ కేటాయింపు
- March 06, 2021
కరోనా ప్రభావంతో పలు దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తరలిచేందుకు చేపట్టిన వందే భారత్ మిషన్ లేటెస్ట్ షెడ్యూల్ ను ప్రకటించింది ఇండియా ప్రభుత్వం. ఈ సారి విడతలో ప్రపంచవ్యాప్తంగా 28 దేశాల నుంచి ఇండియన్లను తీసుకువచ్చేందుకు 1,350 ఫ్లైట్స్ ను షెడ్యూల్ చేసినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ తెలిపారు. మార్చి 1 నుంచి 28 వరకు ఫ్లైట్స్ ను ఆపరేట్ చేస్తామని, ఈ సమయంలో దాదాపు 2,60,000 మంది స్వదేశానికి చేరుకునే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నట్లు వివరించారు. అయితే..మొత్తం 1,350 ఫ్లైట్స్ ని షెడ్యూల్ చేస్తే అందులో సగానికంటే ఎక్కువ జీసీసీ దేశాలకే కేటాయించారు. జీసీసీ దేశాలకు 920 ఫ్లైట్స్ ఆపరేట్ చేయనున్నారు. మొత్తం విమానాల్లో ఇది 68 శాతం. నార్త్ అమెరికా నుంచి 150 ఫ్లైట్స్, యూకే, యూరప్ నుంచి 120, అగ్నేయ ఆసియా దేశాల నుంచి 50 వందే భారత్ మిషన్ ఫ్లైట్లను నడపనున్నట్లు శ్రీవాత్సవ వివరించారు.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







