తెలంగాణలో కరోనా కేసుల వివరాలు
- March 06, 2021
హైదరాబాద్:తెలంగాణలో కరోనా కేసులు తాజాగా మళ్లీ పెరిగాయి.మొన్నటి వరకు తగ్గిన కేసులు.. ఈ మధ్యలో మళ్లీ పెరుగుతున్నాయి.తాజాగా తెలంగాణ ప్రభుత్వం కరోనా బులెటిన్ ను విడుదల చేసింది.ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో తాజాగా 170 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కొత్తగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,99,742కి చేరింది.ఇందులో 2,96,166 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1936 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.అయితే, తాజా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా ఒకరు కరోనాతో మృతి చెందారు.ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1640గా ఉన్నది. కాగా.. గడిచిన 24 గంటల్లో 40,712 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- 200 కి.మీ వేగంతో కారు నడిపిన కువైట్ పౌరుడికి జైలుశిక్ష..!!
- మానవ అక్రమ రవాణా కేసు అప్పీల్పై విచారణ వాయిదా...!!
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!







