కేరళలో మళ్లీ భారీగా కోవిడ్ కేసులు
- March 06, 2021
తిరువనంతపురం:కేరళ లో ఓవైపు అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్న సమయంలో.. కేరళను కోవిడ్ కొత్త కేసులు టెన్షన్ పెడుతున్నాయి.. ఆ రాష్ట్రంలో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది.. కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ వెల్లడించిన తాజా సమాచారం ప్రకారం.. గత 24 గంటల్లో 2,791 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యియి. 16 మంది మృతి చెందారు.. ఇదే సమయంలో 3,517 మంది కరోనానుంచి కోలుకున్నట్టు తెలిపారు సీఎం.. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 42,819 యాక్టివ్ కేసులు ఉండగా.. ఇప్పటి వరకు కరోనాతో 4,287 మంది మృతిచెందారు. రికవరీ కేసుల సంఖ్య 10,27,826కు పెరిగింది. అయితే, టెస్టులను కూడా పెంచింది సర్కార్.. కోవిడ్ కేసులు పెరుగుతుండడంతో.. అప్రమత్తం అవుతున్నారు.. గత 24 గంటల్లో రాష్ట్రంలో 61,764 సాంపిల్స్ పరీక్షించినట్టు సీఎం ప్రకటించారు.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







