ఖైదీలు వ్యాక్సిన్ ఎంపిక చేసుకునే వెసులుబాటు
- March 07, 2021
బహ్రెయిన్: వ్యాక్సిన్ తీసుకునేందుకు సిద్ధంగా ఉన్న ఖైదీలు..దేశంలో అనుమతి పొందిన వ్యాక్సిన్లలో ఏదో ఒకటి ఎంపిక చేసుకోవచ్చని బహ్రెయిన్ ప్రకటించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కోవిడ్ వ్యాక్సిన్ల ప్రభావశీలతను ఇప్పటికే జైలులోని ఖైదీలకు వివరించినట్లు అధికారులు వివరించారు. వారికి అందించిన సమాచారం మేరకు ఖైదీలు ఏ వ్యాక్సిన్ ఎంపిక చేసుకుంటే ఆ వ్యాక్సిన్ వేయనున్నట్లు వెల్లడించారు. అయితే..తొలి దశ వ్యాక్సినేషన్ లో వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఈ అవకాశం లేదు. కేవలం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ను మాత్రమే తీసుకోవాలని, ఫలానా కంపెనీ వ్యాక్సిన్ అని ఎంచుకునేందుకు అవకాశం లేదని అప్పట్లో ప్రకటించింది. అయితే..ప్రస్తుతం వ్యాక్సిన్ లభ్యత పెరగటం, మార్గనిర్దేశకాలు మారుతూ ఉన్న నేపథ్యంలో ఖైదీలకు వ్యాక్సిన్ ఎంపిక చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఇదిలాఉంటే ఖైదీల ఆరోగ్య సంరక్షణ కోసం పకడ్బందీగా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు మానవ హక్కుల సంస్థలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







