రాజ్భవన్ మహిళా ఉద్యోగులతో టి.గవర్నర్ ముఖాముఖి
- March 08, 2021
హైదరాబాద్:అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గవర్నర్ తమిళిసై రాజ్భవన్ మహిళా ఉద్యోగులతో పాండిచ్చేరి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖాముఖి నిర్వహించారు. ఈసందర్భంగా గవర్నర్ మహిళలతో ఆప్యాయతతో పలుకరించారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నకారణంగా తాను ఈసంవత్సరం మీతో కలిసి సంషాన్ని పంచుకోలేక పోతున్నానని అన్నారు. పలువురు మహిళలు తమిళిసైను అమ్మగా సంబోధిస్తూ మీరు మా మధ్య లేక పోవడం వల్ల మాకు ఎంతో బాధగా ఉందని కొందరు కన్నీళ్లుపెట్టుకున్నారు. నేను ఎంత బిజీగా ఉన్నా మీ క్షేమాన్ని మర్చిపోనని గవర్నర్వారికి హామీ ఇచ్చారు.

కొత్త బాధ్యతలు నిర్వహిస్తున్న గవర్నర్కు పలువురు మహిళా ఉద్యోగులు శుభా కాంక్షలు తెలిపారు. అలాగే టాప్-20 గ్లోబల్ వుమెన్ ఎక్స్లెన్స్-2021 అవార్డు వచ్చినందుకు వారు ససంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వర్నర్ మహిళా ఉద్యోగులనుపేరుపేరుగా పిలిచి వారితో మాట్లాడారు. యోగ క్షేమాలు తెలుసుకున్నారు.ఈ సందర్భంగా మహిళా దినోత్సవం సందర్భంగా వారికి తన కార్యదర్శి ద్వారా స్వీట్ బాక్స్లు, జూట్బ్యాగులను అందజేశారు. కేవలం మహిళా అధికారులే కాదు,పారిశుద్ధ్య పనివాళ్లు, గార్డెనింగ్ చేసేవారు, వ్యక్తిగత ఉద్యోగులు ప్రతి ఒక్కరితో గవర్నర్ మాట్లాడారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









