వ్యాక్సిన్ తీసుకున్న వారికి క్వారంటైన్ నుంచి మినహాయింపు
- March 09, 2021
కువైట్ సిటీ:వ్యాక్సిన్ తీసుకున్న వారికి తప్పనిసరి క్వారంటైన్ నిబంధన నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అంటే వ్యాక్సిన్ సర్టిఫికెట్ ఉన్న వారు ఇకపై హోటల్ క్వారంటైన్ లో ఉండాల్సిన అవసరం లేదు. అంతర్జాతీయంగా కోవిడ్ పరిస్థితులను ఎప్పుటికప్పుడు పరిక్షిస్తున్నామని, ఆ తర్వాతే తగిన నిర్ణయాలు తీసుకుంటున్నామని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇదిలాఉంటే..ఇతర దేశాల నుంచి కువైట్ కు వచ్చే వాళ్లంతా వారం పాటు తమ సొంత ఖర్చులతో క్వారంటైన్ లో ఉండాలని ప్రభుత్వం నిబంధన విధించిన విషయం తెలిసిందే. అయితే..దౌత్యవేతలు, చికిత్స కోసం విదేశాలకు వెళ్లి తిరిగి వచ్చే వారు, ఉన్నత చదువుల కోసం వెళ్లి స్వదేశానికి తిరిగొచ్చే కువైట్ యువకులకు మాత్రం తప్పనిసరి క్వారంటైన్ నుంచి మినహాయింపు ఇచ్చిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- కొత్త క్యాంపస్ ఏపీలో...12,000 కొత్త ఉద్యోగాల అవకాశాలు
- ఎన్విరాన్మెంటల్ స్ట్రీట్లో తాత్కాలికంగా మూసివేత..!!
- మరో మూడు దేశాలకు ఒమన్ ఎయిర్ సర్వీసులు..!!
- జా జైలు హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు ఖరారు..!!
- సౌదీ-ఫ్రెంచ్ చొరవపై యూరోపియన్ కౌన్సిల్ ప్రశంసలు..!!
- మిష్రెఫ్ ఫెయిర్గ్రౌండ్లో ఆకట్టుకుంటున్న ఆటో వరల్డ్ షో..!!
- అల్ బర్షా భవనంలో అగ్నిప్రమాదం.. మోహరించిన డ్రోన్లు..!!
- TDP ప్రవేశపెట్టిన తీర్మానానికి వైసీపీ మద్దతు
- ప్రపంచంలో నాలుగో అతిపెద్ద అంతిమయాత్రగా రికార్డు
- శ్రీవారి సేవకులకు VIP బ్రేక్ దర్శనం