వ్యాక్సిన్ తీసుకున్న వారికి క్వారంటైన్ నుంచి మినహాయింపు
- March 09, 2021
కువైట్ సిటీ:వ్యాక్సిన్ తీసుకున్న వారికి తప్పనిసరి క్వారంటైన్ నిబంధన నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అంటే వ్యాక్సిన్ సర్టిఫికెట్ ఉన్న వారు ఇకపై హోటల్ క్వారంటైన్ లో ఉండాల్సిన అవసరం లేదు. అంతర్జాతీయంగా కోవిడ్ పరిస్థితులను ఎప్పుటికప్పుడు పరిక్షిస్తున్నామని, ఆ తర్వాతే తగిన నిర్ణయాలు తీసుకుంటున్నామని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇదిలాఉంటే..ఇతర దేశాల నుంచి కువైట్ కు వచ్చే వాళ్లంతా వారం పాటు తమ సొంత ఖర్చులతో క్వారంటైన్ లో ఉండాలని ప్రభుత్వం నిబంధన విధించిన విషయం తెలిసిందే. అయితే..దౌత్యవేతలు, చికిత్స కోసం విదేశాలకు వెళ్లి తిరిగి వచ్చే వారు, ఉన్నత చదువుల కోసం వెళ్లి స్వదేశానికి తిరిగొచ్చే కువైట్ యువకులకు మాత్రం తప్పనిసరి క్వారంటైన్ నుంచి మినహాయింపు ఇచ్చిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







