వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంశంపై మరోసారి ప్రధానికి సీఎం జగన్ లేఖ

- March 09, 2021 , by Maagulf
వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంశంపై మరోసారి ప్రధానికి సీఎం జగన్ లేఖ

అమరావతి:వైజాగ్ స్టీల్ ప్లాంట్ వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కాకరేపుతోంది...  ప్రైవేటీకరణపై కేంద్రం విధానాలను నిరసిస్తూ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజలు ఇలా అంతా ఆందోళనకు దిగుతున్నారు.. స్టీల్‌ ప్లాంట్‌పై కేంద్రం క్లారిటీ ఇచ్చిన తర్వాత.. నిన్నటి నుంచి ఆందోళనకు కొనసాగుతూనే ఉన్నాయి.. ఈ నేపథ్యంలో.. ప్రధాని నరేంద్ర మోదీకి లేఖరాశారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌ రెడ్డి.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఏపీ సీఎం... తన నేతృత్వంలో అఖిలపక్షం, కార్మిక సంఘ నేతలను ఢిల్లీకి తీసుకొస్తానని లేఖలో పేర్కొన్నారు.దీనికోసం అపాయింట్‌మెంట్ ఇవ్వాల్సింది ప్రధాని మోడీని కోరారు సీఎం వైఎస్ జగన్..ఇక, స్టీల్ ప్లాంటును అభివృద్ధి బాట పట్టించే అంశంపై వివిధ ప్రత్యామ్నాయాలను కూడా తన లేఖలో ప్రధాని మోదీకి సూచించారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com