ఓటు హక్కును వినియోగించుకున్న ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌..

- March 10, 2021 , by Maagulf
ఓటు హక్కును వినియోగించుకున్న ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌..

విజయవాడ:ఆంధ్రప్ర‌దేశ్‌లో మునిసిప‌ల్ ఎన్నిక‌లు కొన‌సాగుతున్నాయి.పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ దంపతులు రాష్ట్రంలో తొలిసారిగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.


రాష్ట్రంలో ఓటర్లుగా నమోదు చేసుకున్న గవర్నర్ దంపతులు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా రాజ్‌భవన్‌ సమీపంలో ఉన్న సీవీఆర్‌జీఎంసీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు.ఈ సందర్భంగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మాట్లాడుతూ ఈ ఎన్నికల ప్రక్రియలో ఓటు హక్కు ఉన్న ప్రతి పౌరుడు తమ ఓటును హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com