శ్రీవారి భక్తులకు శుభవార్త

- March 10, 2021 , by Maagulf
శ్రీవారి భక్తులకు శుభవార్త

తిరుమల వెళ్లాలనుకునే శ్రీవారి భక్తులకు శుభవార్త. ఐఆర్‌సీటీసీ టూరిజం తిరుపతి టూర్ ప్యాకేజీ ప్రకటించింది. హైదరాబాద్ నుంచి తిరుపతికి ఫ్లైట్‌లో తీసుకెళ్లి శ్రీవారి ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు కూడా చేస్తోంది. 2021 మార్చి 19, 26, ఏప్రిల్ 2, 9, 16, 23 తేదీల్లో ఈ టూర్ ప్రారంభం అవుతుంది. శ్రీవారి దర్శనంతో పాటు కాణిపాకం, శ్రీనివాస మంగాపురం, శ్రీకాళహస్తి, తిరుచానూర్ ఆలయాలకు కూడా తీసుకెళ్తుంది. ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలను https://www.irctctourism.com/వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.ఇదే వెబ్‌సైట్‌లో బుకింగ్ చేయాల్సి ఉంటుంది.ఐఆర్‌సీటీసీ తిరుపతి టూర్ ప్యాకేజీ వివరాలు చూస్తే మొదటి రోజు ఉదయం హైదరాబాద్‌లో ఫ్లైట్ ఎక్కితే గంటన్నరలో తిరుపతి చేరుకుంటారు.తిరుపతి ఎయిర్‌పోర్ట్ నుంచి హోటల్‌కు తీసుకెళ్తారు.హోటల్‌లో చెక్ ఇన్ అయిన తర్వాత కాణిపాకం, శ్రీకాళహస్తి, శ్రీనివాస మంగాపురం తీసుకెళ్తారు.సాయంత్రానికి తిరిగి హోటల్‌కు చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేయాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com