వలస కార్మికుల కోసం డిజిటల్ ఐడీల జారీ

- March 14, 2021 , by Maagulf
వలస కార్మికుల కోసం డిజిటల్ ఐడీల జారీ

సౌదీ: అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవటంలో భాగంగా డిజిటలైజేషన్ వైపు పరుగులు తీస్తున్న సౌదీ ప్రభుత్వం ముఖీమ్ డిజిటల్ వర్షన్ ను ప్రారంభించింది. ముఖీమ్ డిజటలైజేషన్ ద్వారా వలస కార్మికులకు డిజిటల్ ఐడీలను జారీ చేస్తారు. మరోవైపు నాణ్యమైన ప్రభుత్వ సేవలను పొందెందుకు అబ్షర్ వ్యక్తిగత యాప్ ను కూడా ప్రారంభించింది. అబ్షర్ యాప్ ద్వారా ప్రభుత్వ కార్యాలయాల సేవల్లో నాణ్యతను పెంచేందుకు అవకాశం ఉంటుందని అధికారులు వెల్లడించారు. వినియోగదారుల సంతృప్తి స్థాయిలను పెంచటమే తమ లక్ష్యమని పేర్కొంది. అబ్షర్ యాప్ లోని క్యూఆర్ కోడ్ ద్వారా సేవలకు సంబంధించిన అన్ని వివరాలను డిజిటల్ గా పొందవచ్చని, అలాగే ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండానే డిజిటల్ ఐడీలను అధికారులకు చూపించేందుకు అవకాశం ఉంటుందని వివరించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com