పసిడిపై బడ్జెట్ ప్రభావం..
- February 28, 2016
2016-17 వార్షిక బడ్జెట్ ప్రభావం బడ్జెట్పై ఉంటుందని నిపుణుల అంచనా. ప్రత్యేకించి పసిడి దిగుమతి సుంకంపై కేంద్రం నిర్ణయం పసిడి ధరలపై ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం పసిడిపై దిగుమతి సుంకం 10 శాతంగా ఉంది. దీనిని పెంచితే దేశీయంగా ధర మరింత పెరుగుతుందని, తగ్గిస్తే, కొంత తగ్గుదలకు అవకాశం ఉంటుందని ఈ రంగంలో నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్తో పోల్చితే భారత్లో ధర దాదాపు రూ.3,000 అధిక ప్రీమియంతో ఉంది. వారంలో ధర కదలికలు ఇలా... అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్ నెమైక్స్లో చురుగ్గా ట్రేడవుతున్న ఏప్రిల్ డెలివరీ పసిడి ఔన్స్ (31.1గ్రా) కాంట్రాక్ట్ ధర వారం వారీగా దాదాపు 10 డాలర్లు తగ్గింది.1,220 డాలర్లు వద్ద ముగిసింది. లాభాల స్వీకరణ దీనికి కారణంగా పేర్కొంటున్నారు. అయితే రూపాయి బలహీనత కారణంగా, దేశీయంగా ప్రధాన ముంబై స్పాట్ మార్కెట్లో పసిడి 99.9 స్వచ్ఛత 10 గ్రాముల ధర వారం వారీగా స్వల్పంగా రూ.135 ఎగసింది. రూ.29,230 వద్ద ముగిసింది. 99.5 స్వచ్ఛత ధర సైతం ఇంతే స్థాయిలో ఎగసి 29,080కి చేరింది.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









