`విజయకృష్ణ గ్రీన్ స్టూడియోస్` కర్టన్ రైజర్!
- March 15, 2021హైదరాబాద్:పద్మాలయ సంస్థ 52 వసంతాలు పూర్తి చేసుకోవడంతో పాటు, విజయకృష్ణ మూవీస్ స్థాపించి 50 వసంతాలు అవుతున్న సందర్భంగా ఇరు సంస్థలకు మూల స్థంభం అయినటువంటి సూపర్ స్టార్ కృష్ణ, పద్మాలయ రధసారథి జి. ఆదిశేషగిరిరావును, విజయకృష్ణ మూవీస్ నిర్మాతలు ఎస్.రవి కుమార్,రమానంద్ ( కీ.శే.విజయనిర్మల సోదరులు)లను సీనియర్ నటుడు నరేష్, అతని తనయుడు నవీన్ విజయ్ కృష్ణ సత్కరించారు. విజయకృష్ణ మూవీస్ సూపర్హిట్ చిత్రం 'మీనా'తో ప్రారంభించి, 'హేమాహేమీలు, అంతం కాదు ఇది ఆరంభం' లాంటి చిత్రాలు కృష్ణతో నిర్మించడంతో పాటు నరేష్తో 'ప్రేమ సంకెళ్లు, ముక్కోపి' లాంటి హిట్ చిత్రాలు నిర్మించి, విజయనిర్మలకు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లభించడానికి దోహదపడింది. 1976 నుండి డబ్బింగ్, రికార్డింగ్ స్టూడియోలు, ఎడిటింగ్ రూమ్స్ లో పాటు సినీ పరిశ్రమకు కావాల్సినటువంటి పోస్ట్ ప్రొడక్షన్ స్టూడియోస్ విజయకృష్ణ మూవీస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఆ సంస్థ 50 సంవత్సరాలు పూర్తిచేసుకుంటున్న సందర్భంగా రెండోతరం అయినటువంటి డా.నరేష్, మూడోతరం నవీన్ విజయ కృష్ణ ఆ సంస్థని `విజయకృష్ణ గ్రీన్ స్టూడియోస్` పేరుతో పునర్నిర్మాణం చేశారు.ఇప్పడు సినీ పరిశ్రమకు కావాల్సిన సదుపాయాలు, హార్డ్ వేర్, సాఫ్ట్వేర్ తయారు చేయడానికి రంగం సిద్దం చేశారు.ఈ క్రమంలో కర్టన్ రైజర్ కార్యక్రమాన్ని సినీ పరిశ్రమకు సంబంధించిన పెద్దలతో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సాయిధరమ్ తేజ్,ఆనంద్ దేవరకొండ,సుధీర్ బాబు,వెంకటేష్ మహా, శ్రీరామ్ ఆదిత్య, వి ఐ ఆనంద్, శరత్ మరార్, మదాల రవి తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..
- ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్కీ సపోర్టు వచ్చేసింది..
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!