రెస్టారెంట్ల వద్ద ఇప్తార్ మీల్ పంపిణీపై నిషేధం
- March 16, 2021
రస్ అల్ ఖైమా: రస్ అల్ ఖైమా పోలీస్ విభాగం, రెస్టారెంట్ల లోపల, రెస్టారెంట్ల వెలుపల ఇప్తార్ మీల్స్ పంపిణీపై నిషేధం విధించింది. పవిత్ర రమదాన్ మాసంలో ఇఫ్తార్ మీల్స్ పంపిణీ అనేది సర్వసాధారణంగా జరుగుతుంటుంది. అయితే, ఇళ్ళ బయట కూడా ఇఫ్తార్ మీల్స్ పంపిణీ చేయడానికి వీల్లేదని అధికారులు స్పష్టం చేశారు. రెసిడెన్షియల్ లేబర్ కాంప్లెక్సుల్లో ఇఫ్తార్ మీల్స్ పంపిణీకి అనుమతి వుంది. అయితే, బాక్సులు లేదా బ్యాగులలో మాత్రమే వాటిని పంపిణీ చేయాల్సి వుంటుంది. సోషల్ డిస్టెన్సింగ్ ప్రతి ఒక్కరూ పాటించాలని పోలీసులు హెచ్చరించారు. కరోనా నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు అధికారులు. దుబాయ్, షార్జా అలాగే అజ్మన్ తదితర ప్రాంతాల్లో రమదాన్ టెంట్ పర్మిషన్లు కూడా రద్దు చేసిన విషయం విదితమే. ఏప్రిల్ 13 నుంచి రమదాన్ ప్రారంభం కానుంది.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం