మనీ లాండరింగ్ కేసులో ఇద్దరు సౌదీలకు 28 ఏళ్ళ జైలు

- March 16, 2021 , by Maagulf
మనీ లాండరింగ్ కేసులో ఇద్దరు సౌదీలకు 28 ఏళ్ళ జైలు

సౌదీ: మనీ లాండరింగ్ కేసులో ఇద్దరు సౌదీ జాతీయులకు 28 ఏళ్ళ జైలు శిక్ష అలాగే 13 మిలియన్ సౌదీ రియాల్స్ జరీమానా విధించింది న్యాయస్థానం. డబ్బుని విదేశాలకు స్మగుల్ చేస్తున్నట్లు నిందితులపై అభియోగాలు నిరూపించబడ్డాయి. నిందితులు కమర్షియల్ రిజిస్ట్రేషన్ ప్రారంభించి, బ్యాంకు అకౌంట్లు ఓపెన్ చేసి, వాటి ద్వారా మనీ లాండరింగ్‌కి పాల్పడ్డారు. అక్రమంగా విదేశీయులు ఈ రిజిస్ట్రేషన్ ద్వారా పెద్దమొత్తాల్లో డబ్బుల్ని తరలించినట్లు అధికారులు వివరించారు. మొత్తం 695 మిలియన్ సౌదీ రియాల్స్ ఇలా చేతులు మారగా, దాన్ని స్వాధీనం చేసుకోవాల్సిందిగా న్యాయస్థానం ఆదేశించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com