చైన్ సిస్టంతో యూఏఈలో గోల్డ్ స్కాం..నలుగురుకి జైలు శిక్ష, జరిమానా
- March 16, 2021
యూఏఈ: గోల్డ్ స్కీం పేరుతో వేల మందిని మోసం చేసిన నలుగురికి యూఏఈ కోర్టు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి 10 మిలియన్ల దిర్హామ్ ల జరిమానా విధించింది. నిందితులు పిలిఫినోలని కోర్టు రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఈ నలుగురు పిలిఫోనులు యూఏఈలోని పిలిఫినోలను టార్గెట్ గా చేసుకొని భారీ స్కాంకు స్కెచ్ వేశారు. గోల్డ్ ఎంపైర్ మేనేజ్మెంట్ పేరుతో ఓ వెబ్ సైట్ ను క్రియేట్ చేసి..తాము గోల్డ్ స్కీం పెడుతున్నట్లు సోషల్ మీడియా, ఇతర మాధ్యామాల్లో విస్తృతంగా ప్రచారం చేసుకున్నారు. తమ స్కీంలో చేరాలంటే ఒక్కో వ్యక్తి 2000 దిర్హామ్ లు చెల్లించాలని..ఆ తర్వాతి కాలంలో కల్లు చెదిరే రేంజ్ లో లాభాలు ఆర్జించవచ్చని ఆశపెట్టారు నిందితులు. అంతేకాదు..తమ స్కీంలో కొత్త సభ్యులను చేర్పిస్తే ఒక్కో కొత్త సభ్యుడికిగాను 1000 దిర్హామ్ ల చొప్పున చేర్పించిన వారికి రివార్డ్ గా అందిస్తామని ప్రచారం చేశారు. అలా దాదాపు 4000 మంది పిలిఫినోలను చైన్ సిస్టం స్కీమ్ పేరుతో చీట్ చేశారు నిందితులు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు నిందితులకు జైలు శిక్ష, జరిమానాతో పాటు శిక్షాకాలం తర్వాత దేశబహిష్కరణ వేటు కూడా వేసింది.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు