వ్యాక్సిన్ పై ఎవరిష్టం వారిది..ప్రవాసీయుల ఎంట్రీపై ఎటూ తేల్చని కువైట్
- March 16, 2021
కువైట్: దేశవ్యాప్తంగా పాక్షిక కర్ఫ్యూ విధించినా కువైట్లో కోవిడ్ తీవ్రత కొనసాగుతూనే ఉంది. ఇంటెన్సిటీవ్ కేర్ యూనిట్లలో చికిత్స పొందుతున్న వైరస్ బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో సమావేశమైన కువైట్ మంత్రి మండలి కోవిడ్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో మాత్రం చెప్పుకోదగ్గ నిర్ణయాలు తీసుకోలేదు. దీంతో ఇప్పటివరకు అనుసరిస్తున్న విధానాలే కొనసాగనున్నాయి. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్ తీసుకోవటం తప్పనిసరి చేసే అవకాశాలు ఉన్నట్లు అంతా అనుకున్నారు. కానీ, మంత్రిమండలి అలాంటి నిర్ణయమేది తీసుకోలేదు. ఆంక్షల సమయం పెరుగుతుందని అంచనాలు విన్పించిన విషయం తెలిసిందే. అలాగే కర్ఫ్యూ సమయంలో రెస్టారెంట్లకు ఫుడ్ డెలివరీ అవకాశం కల్పిస్తారని అంతా భావించారు. కానీ, మంత్రివర్గం మాత్రం అలాంటి నిర్ణయాలు ఏం తీసుకోలేదు. అలాగే ప్రవాసీయలు ఎంట్రీపైనా మంత్రిమండలి ఎటూ తేల్చలేదు. కానీ, ఇతర దేశాల్లో చిక్కుకుపోయిన టీచర్ల రాకపై విద్యాశాఖ మంత్రి నిర్ణయం తీసుకుంటుందని మాత్రం వెల్లడించింది.
తాజా వార్తలు
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్
- డిసప్పియర్ ఇంక్తో చెక్కు.. ఓ అరబ్ వ్యక్తికి షాకిచ్చిన దుబాయ్ కోర్టు..!!
- కువైట్ లో బాటిల్ వాటర్ కొనుగోలుపై పరిమితి కొనసాగింపు..!!
- ఉగ్రవాద ముఠా అరెస్ట్ పై కువైట్ హోంశాఖ క్లారిటీ..!!
- 7రోజుల్లో 18 వేల ఎక్స్ పైరీ ఉత్పత్తులు స్వాధీనం..!!
- జీ20 ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ దేశాల్లో సౌదీకి చోటు..!!
- బహ్రెయిన్ లో విదేశీ వైద్యుల ఆపరేషన్లపై కఠిన నిబంధనలు..!!







