రమదాన్ నేపథ్యంలో కోవిడ్ 19 సూచనలు
- March 17, 2021
యూఏఈ: పవిత్ర రమదాన్ మాసం నేపత్యంలో మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ప్రివెన్షన్, కొన్ని స్పష్టమైన సూచనలు, హెచ్చరికలు, ఆదేశాలు జారీ చేసింది. కుటుంబాల సమూహం, ఆహారం పరస్పరం పంచుకోవడం వంటివాటికి దూరంగా వుండాలని మినిస్ట్రీ సూచించింది. మసీదులు, ఇతర బహిరంగ ప్రాంతాల్లో సామూహికంగా ఇఫ్తార్ టెంట్లను నిర్వహించడాన్ని, ఇప్తార్ మీల్స్ ఏర్పాటు చేయడాన్నీ నిషేధించింది. రెస్టారెంట్లు మీల్స్ పంపిణీ చేయడానికి వీల్లేదు. లేబర్ అకామడేషన్లలో మాత్రమే మీల్స్ పంపిణీ చేయాల్సి వుంటుంది. ఎవరైతే కార్మికులకు మీల్స్ పంపిణీ చేయాలనుకుంటారో, వాళ్ళు ముందుగా అకామడేషన్ మేనేజ్మెంట్ని అలాగే రెస్టారెంట్లను సంప్రదించి, ప్యాకెట్ల రూపంలో పంపిణీ చేయాల్సి వుంటుంది. తరావీ ప్రార్థనలు ఖచ్చితమైన సూచనలకు లోబడి మాత్రమే చేయాల్సి వుంటుంది. ఇషా మరియు తరావీ ప్రార్థనలు 30 నిమిషాలకు లోబడి మాత్రమే చేయాలి. రమదాన్ మాసంలో అధికారులు ఎప్పటికప్పుడు పూర్తిస్థాయిలో తనిఖీలు నిర్వహిస్తారు.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







