వచ్చే విద్యా సంవత్సరంలోనూ హైబ్రిడ్ స్కూలింగ్
- March 18, 2021
యూఏఈ:కోవిడ్ ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో వచ్చే విద్యా సంవత్సరం నిర్వహణపై యూఏఈ విద్యా శాఖ ఫోకస్ చేసింది. విద్యార్ధులను వైరస్ బారి నుంచి కాపాడేందుకు ఈ విద్యా సంవత్సరంలో ఎక్కువగా రిమోట్ టీచింగ్ కే పరిమితం అయిన విషయం తెలిసిందే. అయితే..వచ్చే ఏడాదికి సంబంధించి ఓ నిర్ధిష్ట ప్రణాళికతో ముందుకు వెళ్లేలా రిమోట్ లెర్నింగ్, ఫేస్ టు ఫేస్ క్లాసెస్ నిర్వహించేలా హైబ్రిడ్ స్కూలింగ్ విధానాన్ని సిద్ధం చేస్తున్నారు. అంటే వచ్చే విద్యా సంవత్సరంలో అవసరమైన మేర ఆన్ లైన్ క్లాసెస్ నిర్వహిస్తామని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. అదే సమయంలో విద్యార్ధుల్లో నైపుణ్యత పెంచేందుకు మాత్రం కొంత సమయం ప్రత్యక్ష తరగుతులకు హజరుకావాల్సి ఉంటుంది. అంటే ల్యాబ్ క్లాసెస్, సాంకేతిక అంశాలు, విద్యార్ధుల మధ్య టీం వర్క్ స్కిల్స్, క్రీడలకు సంబంధించిన అంశాల సాధనకు విద్యార్ధులు స్కూల్ కి హజరయ్యేలా వచ్చే అకాడమిక్ ఇయర్ కు విద్యా విధానాన్ని రూపొందిస్తున్నారు.
తాజా వార్తలు
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు
- నాగ్పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్పోర్ట్స్







