16 కిలోల బంగారం స్మగ్లింగ్, ముగ్గురికి జైలు
- March 18, 2021బహ్రెయిన్:ముగ్గురు అరబ్ వ్యక్తులకు న్యాయస్థానం ఆరు నెలల జైలు శిక్ష విధించింది. 16 కిలోల బంగారం స్మగ్లింగ్ కేసులో నిందితులకు న్యాయస్థానం శిక్షలు ఖరారు చేసింది. ఉద్దేశపూర్వకంగా దుస్తుల కింద బంగారం దాచి, దేశంలోకి స్మగుల్ చేసేందుకు నిందితులు యత్నించినట్లు విచారణలో తేలింది. కస్టమ్స్ అధికారులు, బంగారం గురించి అడగ్గా, వారు డిక్లరేషన్కి అంగీకరించలేదు. తమ వద్ద బంగారం లేదని పేర్కొన్నారు. అనంతరం వారి నుంచి బంగారాన్ని అధికారులు కనుగొన్నారు. బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అప్పీల్ చేయడానికి వీలుగా 100 బహ్రెయినీ దినార్స్ పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు