'ఆత్మహత్యల నివారణ - జీవితం చాలా విలువైనది' అనే అంశంపై స్పందించిన రాష్ట్ర హోంశాఖ మంత్రి
- March 18, 2021
హైదరాబాద్: క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకునే వారు... వారి భవిష్యత్ తో పాటు కని,పెంచిన తల్లిదండ్రుల గురించి ఆలోచన చేయాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ కోరారు. ఆత్మహత్యల నివారణ- జీవితం చాలా విలువైనది అనే అంశంపై... హైదరాబాద్ రవీంద్రభారతిలో స్పందన ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సామెల్ రెడ్డి అధ్యక్షతన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో హోంమంత్రి తో పాటు రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త, రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ,మాధవి తో పాటు వివిధ కళాశాలల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పరీక్ష ఫలితాలు తప్పండం , ఉద్యోగం దొరకక , ప్రేమ విఫలమై ఇలా తదితర ఎన్నో కారణాలతో బ్రతుకు భారమనుకోని తొందరపాటు నిర్ణయాలతో జీవితాన్ని అర్దాంతరంగా ముగిస్తూ... తల్లిదండ్రుల కడుపుకోతకు కారణమవుతున్నారని హోంమంత్రి తెలిపారు. ఇటువంటి వారికి షీటీమ్ ఆధ్వర్యంలో... ముందస్తుగా ఆత్మహత్యల నివారణ కోసం కౌన్సెలింగ్ ఇస్తున్నట్లు ముఖ్యంగా విద్యార్థిని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సామెల్ రెడ్డి కూతురు స్పందన ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన తర్వాత అలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ఉండేందుకు... గత 14నెలలుగా ప్రత్యేకంగా, పరోక్షంగా వేల మందికి ఆత్మస్థైర్యం నింపడంతో పాటు ఆత్మహత్యల నివారణ కోసం చేస్తున్న కృషిని మహమూద్ అలీ అభినందించారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







