రమదాన్ నేపథ్యంలో కోవిడ్ కొత్త మార్గనిర్దేశకాలు జారీ చేసిన దుబాయ్
- March 18, 2021దుబాయ్: పవిత్ర రమదాన్ మాసం నేపథ్యంలో దుబాయ్ సుప్రీం కమిటీ కొత్త మార్గనిర్దేశకాలను జారీ చేసింది. ప్రార్థనలు, ఇఫ్తార్ విందుల నిర్వహణతో వైరస్ వ్యాప్తి మరింత వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయంటూ హెచ్చరించింది. కోవిడ్ ను అరికట్టేందుకు రమదాన్ మాసంలోనూ ఆంక్షల అమలు అనివార్యమంటూ పేర్కొంది. ముఖ్యంగా వృద్ధులు , దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. సమాజ ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొని సోషల్ గ్యాదరింగులపై నిషేధం విధిస్తున్నట్లు స్పష్టం చేసింది. అలాగే రమదాన్ టెంట్లను, ఇఫ్తార్ విందులు, డొనేషన్ టెంట్లపై నిషేధం విధిస్తున్నట్లు వెల్లడించింది. ఇక తారవీ ప్రార్థనల సమయంలోనూ మసీదులలో కోవిడ్ నిబంధనలను ఖచ్చితంగా పాటించి తీరాల్సిందేనని దుబాయ్ సుప్రీం కమిటీ హెచ్చరించింది. ప్రార్థన సమయం 30 నిమిషాలకు పరిమితం చేస్తున్నట్లు ప్రకటించింది. ఇదిలాఉంటే..ఎమిరాతి పరిధిలో కోవిడ్ తీవ్రతను పరిగణలోకి తీసుకొని రమదాన్ చివరి పది రోజుల ప్రార్థనలకు సంబంధించి నిర్ణయం తీసుకుంటామని సుప్రీం కమిటీ క్లారిటీ ఇచ్చింది.
తాజా వార్తలు
- గాజాలో తక్షణ కాల్పుల విరమణకు GCC, EU ఉమ్మడి చర్యలు. !
- బ్యాంకులు రుణ వాయిదాలు 6 నెలల పాటు వాయిదా..!
- 3 నెలల్లో 67 హాస్పిటాలిటీ సౌకర్యాలు మూసివేత
- జిలీబ్ అల్-షుయౌఖ్లో ఆసియా జాతీయుడి హత్య..!
- యూఏఈ అధ్యక్షుడితో సుల్తాన్ కీలక చర్చలు
- విమానాల్లో 12 ఏళ్లలోపు చిన్నారులకు వారి పేరెంట్స్ పక్కనే సీటు ఇవ్వాలి: DGCA
- బాధిత కుటుంబాల కోసం వాట్సాప్ నంబర్ ప్రారంభం
- కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తుల కిటకిట
- విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ వ్యతిరేకం: సీఎం జగన్
- గాల్లో ఢీకొన్నరెండు హెలీకాప్టర్లు..10 మంది మృతి