దుబాయ్ లో ఏ.పీ వాసి ఆత్మహత్య...
- March 19, 2021
దుబాయ్:ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా కు చెందిన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.వివరాల్లోకి వెళ్తే...గోగినేని సత్య సాయినాథ్ అనే 25 సంవత్సరాల యువకుడు M.B.A పూర్తి చేసుకుని ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా నుంచి 19 జనవరి 2021 న యూఏఈ కి బ్రతుకు తెరువు కి వచ్చాడు.ఇక్కడ ఒక కంపెనీ లో ఉద్యోగంలో చేస్తున్నట్టుగా ఇండియా లో తల్లిదండ్రులకు తెలిపాడు.కానీ ఏమి అయ్యిందో తెలియదు కానీ ఉన్నట్టు వుండి 16 ఫిబ్రవరి నుండి ఫోన్ తలిదండ్రులకు రాకపోవడము తో, తల్లిదండ్రులు కంగారు పడుతూ తెలిసిన వాళ్ళతో సంప్రదించగా,16 వ తారీఖున సాయినాథ్ బలవన్మరణానికి పాల్పడినట్టు తెలిసింది. వెంటనే స్థానిక MLA అబ్బయ్య చౌదరి ద్వారా APNRTS చైర్మన్ వెంకట్ మేడపాటి వారి దృష్టికి తీసుకుని రావడముతో వారు యూఏఈ లో వున్న APNRTS శాఖ ద్వారా మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేయడము జరిగింది.కానీ మృతదేహా నికి పంచనామాలో ఆ యువకునికి COVID Positive వుండడము వలన మృతదేహాన్ని పంపించడము కుదరలేదు.వెంటనే యూఏఈ లోని వివిధ భారతీయ మంత్రిత్వ శాఖలు మరియు, యూఏఈ ప్రభుత్వ సహకారాముతో ఆ యువకునికి వాళ్ళ తల్లిదండ్రుల పూర్తి ఆమోదంతో ఈ రోజున అంత్య క్రియలు జరిపారు.ఈ విషయములో సహాయసహకారములు అందించిన ఆనందకుమార్ (APNRTS Provisional Coordinator-UAE),మురళికు మృతుని తల్లితండ్రులు ధన్యవాదాలు తెలిపారు.
తాజా వార్తలు
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- ఐరా ‘స్పా’ మసాజ్ సెంటర్ లో వ్యభిచారం.. నలుగురు అరెస్ట్!
- బసవతారకం హాస్పిటల్: ఏపీ వాసులకు శుభవార్త..









