దుబాయ్ లో ఏ.పీ వాసి ఆత్మహత్య...
- March 19, 2021
దుబాయ్:ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా కు చెందిన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.వివరాల్లోకి వెళ్తే...గోగినేని సత్య సాయినాథ్ అనే 25 సంవత్సరాల యువకుడు M.B.A పూర్తి చేసుకుని ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా నుంచి 19 జనవరి 2021 న యూఏఈ కి బ్రతుకు తెరువు కి వచ్చాడు.ఇక్కడ ఒక కంపెనీ లో ఉద్యోగంలో చేస్తున్నట్టుగా ఇండియా లో తల్లిదండ్రులకు తెలిపాడు.కానీ ఏమి అయ్యిందో తెలియదు కానీ ఉన్నట్టు వుండి 16 ఫిబ్రవరి నుండి ఫోన్ తలిదండ్రులకు రాకపోవడము తో, తల్లిదండ్రులు కంగారు పడుతూ తెలిసిన వాళ్ళతో సంప్రదించగా,16 వ తారీఖున సాయినాథ్ బలవన్మరణానికి పాల్పడినట్టు తెలిసింది. వెంటనే స్థానిక MLA అబ్బయ్య చౌదరి ద్వారా APNRTS చైర్మన్ వెంకట్ మేడపాటి వారి దృష్టికి తీసుకుని రావడముతో వారు యూఏఈ లో వున్న APNRTS శాఖ ద్వారా మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేయడము జరిగింది.కానీ మృతదేహా నికి పంచనామాలో ఆ యువకునికి COVID Positive వుండడము వలన మృతదేహాన్ని పంపించడము కుదరలేదు.వెంటనే యూఏఈ లోని వివిధ భారతీయ మంత్రిత్వ శాఖలు మరియు, యూఏఈ ప్రభుత్వ సహకారాముతో ఆ యువకునికి వాళ్ళ తల్లిదండ్రుల పూర్తి ఆమోదంతో ఈ రోజున అంత్య క్రియలు జరిపారు.ఈ విషయములో సహాయసహకారములు అందించిన ఆనందకుమార్ (APNRTS Provisional Coordinator-UAE),మురళికు మృతుని తల్లితండ్రులు ధన్యవాదాలు తెలిపారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







