దుబాయ్ లో ఏ.పీ వాసి ఆత్మహత్య...
- March 19, 2021
దుబాయ్:ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా కు చెందిన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.వివరాల్లోకి వెళ్తే...గోగినేని సత్య సాయినాథ్ అనే 25 సంవత్సరాల యువకుడు M.B.A పూర్తి చేసుకుని ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా నుంచి 19 జనవరి 2021 న యూఏఈ కి బ్రతుకు తెరువు కి వచ్చాడు.ఇక్కడ ఒక కంపెనీ లో ఉద్యోగంలో చేస్తున్నట్టుగా ఇండియా లో తల్లిదండ్రులకు తెలిపాడు.కానీ ఏమి అయ్యిందో తెలియదు కానీ ఉన్నట్టు వుండి 16 ఫిబ్రవరి నుండి ఫోన్ తలిదండ్రులకు రాకపోవడము తో, తల్లిదండ్రులు కంగారు పడుతూ తెలిసిన వాళ్ళతో సంప్రదించగా,16 వ తారీఖున సాయినాథ్ బలవన్మరణానికి పాల్పడినట్టు తెలిసింది. వెంటనే స్థానిక MLA అబ్బయ్య చౌదరి ద్వారా APNRTS చైర్మన్ వెంకట్ మేడపాటి వారి దృష్టికి తీసుకుని రావడముతో వారు యూఏఈ లో వున్న APNRTS శాఖ ద్వారా మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేయడము జరిగింది.కానీ మృతదేహా నికి పంచనామాలో ఆ యువకునికి COVID Positive వుండడము వలన మృతదేహాన్ని పంపించడము కుదరలేదు.వెంటనే యూఏఈ లోని వివిధ భారతీయ మంత్రిత్వ శాఖలు మరియు, యూఏఈ ప్రభుత్వ సహకారాముతో ఆ యువకునికి వాళ్ళ తల్లిదండ్రుల పూర్తి ఆమోదంతో ఈ రోజున అంత్య క్రియలు జరిపారు.ఈ విషయములో సహాయసహకారములు అందించిన ఆనందకుమార్ (APNRTS Provisional Coordinator-UAE),మురళికు మృతుని తల్లితండ్రులు ధన్యవాదాలు తెలిపారు.
తాజా వార్తలు
- అత్యవసర సమయాల్లో పేరెంట్స్ బీ అలెర్ట్: ఖతార్
- మిడిల్ ఈస్ట్ కు పరిమితంగా ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్స్..!!
- కువైట్లో డ్రోన్ శకలాలు తగిలి 11 ఏళ్ల బాలిక మృతి..!!
- ఒమన్లో డ్రోన్లు, ఏరియల్ వస్తువుల పై అలెర్ట్ జారీ..!!
- యూఏఈలో మెడిసిన్ స్టాక్ పై ఆందోళన వద్దు..!!
- 9 డ్రోన్లను అడ్డుకొని ధ్వంసం చేశాము: సౌదీ
- ఎతిహాద్ రైల్ సాహసోపేత చర్య
- యూఏఈలోని యూఎస్ మిషన్లు క్లోజ్..!!
- ChatGPT ని వదిలేస్తున్న మిలియన్ల మంది యూజర్లు!
- భారతీయుల కోసం ప్రత్యేక హెల్ప్లైన్ నంబర్లు









