కువైట్: 16 ఏళ్ళు పైబడిన విద్యార్థులకు వ్యాక్సినేషన్
- March 20, 2021కువైట్:మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, 16 ఏళ్ళు ఆ పైబడిన విద్యార్థులంతా వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పిలుపునిచ్చింది. స్పెషల్ అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ డాక్టర్ అబ్దుల్ మొహ్సెన్ అల్ హువైలియా మాట్లాడుతూ, ప్రైవేటు స్కూల్స్ సిబ్బంది అలాగే 16 ఏళ్ళు పైబడిన విద్యార్థులు వ్యాక్సిన్ కోసం రిజిస్టర్ చేసుకోవాలని చెప్పారు. వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా కరోనా వైరస్ నుంచి తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కాకుండా, కరోనా వైరస్ వ్యాప్తిని కూడా అరికట్టవచ్చని ఆయన సూచించారు. ఫైజర్ బయో ఎన్ టెక్ వ్యాక్సిన్ కేవలం 16 ఏళ్ళ పైబడిన వారికి మాత్రమే ఉపయోగించాల్సి వుంటుంది. ఈ కారణంగా 16 ఏళ్ళ లోపువారికి వ్యాక్సినేషన్ కుదరదు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?