వ్యాక్సిన్ తీసుకుంటే నో క్వారంటైన్..పరిశీలిస్తోన్న కువైట్
- March 21, 2021
కువైట్ సిటీ:వ్యాక్సిన్ తీసుకున్నవారికి క్వారంటైన్ నుంచి మినహాయింపు ఇవ్వాలన్న పార్లమెంట్ సభ్యుల ప్రతిపాదనను కువైట్ ప్రభుత్వం పరిశీలిస్తోంది. వచ్చే సెషల్ లో క్వారంటైన్ నిబంధన కొనసాగించాలా...మినహాయింపు ఇవ్వాలనే దానిపై ఓ స్పష్టమైన ప్రకటన వెలువరించే అవశాలు ఉన్నాయి. అంతర్జాతీయ ప్రయాణ నిబంధనలను సులభతరం చేసేలా వ్యాక్సిన్ తీసుకున్న కువైట్ పౌరులకు క్వారంటైన్ నుంచి మినహాయింపు ఇవ్వాలని పార్లమెంట్ సభ్యులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. కొరోనా పాస్ పోర్ట్ లను అనుమతించి వ్యాక్సిన్ తీసుకున్న వారికి ప్రయాణ నిబంధనలను సడలించాలని అంటున్నారు. కువైట్ పొరుగు దేశాలు కూడా ఈ విషయంలో త్వరతగతిన నిర్ణయం తీసుకొని వ్యాక్సిన్ పొందిన వారికి కొన్ని సడలింపులు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ..కువైట్లో ఇప్పటికే 4,62,000 మంది వ్యాక్సిన్ తీసుకున్నారని..అయినా క్వారంటైన్ నిబంధనను కొనసాగించటంలో అర్ధం లేదన్నది పార్లమెంటేరియన్ల వాదన. వ్యాక్సిన్ తీసుకున్న వారిని కూడా క్వారంటైన్ నిబంధన పరిధిలోకి తీసుకురాటం ద్వారా వ్యాక్సినేషన్ వల్ల ప్రయోజనం ఏంటని ప్రశ్నిస్తున్నారు. దీంతో పార్లమెంటేరియన్ల డిమాండ్ ను పరిగణలోకి తీసుకున్న కువైట్ వ్యాక్సిన్ తీసుకున్న వారిని క్వారంటైన్ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఇదిలాఉంటే కువైట్ మంత్రివర్గ నిర్ణయం ఎలా ఉన్నా..అందుకు తగినట్లుగా సిద్ధంగా ఉండేందుకు మోసాఫెర్ యాప్ లో వ్యాక్సిన్ సర్టిఫికెట్ ఆప్షన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..







