భారత్ లో కరోనా కేసుల వివరాలు
- March 21, 2021న్యూ ఢిల్లీ: భారత్ లో రోజువారీ పాజిటివ్ కేసులు గరిష్టస్థాయిలో నమోదవుతున్నాయి.నాలుగు నెలల క్రితం ఏ స్థాయిలో కేసులు నమోదయ్యాయో అదే విధంగా ఇప్పుడు కేసులు నమోదవుతుండటం కొంత భయాన్ని కలిగిస్తోంది.సెకండ్ వేవ్, కొత్త స్ట్రెయిన్ వేరియంట్లు మన దేశంలో పెద్దగా కనిపించలేదని నిపుణులు పేర్కొన్న సంగతి తెలిసిందే.అయితే, ఇప్పుడు కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వాలు అలర్ట్ అవుతున్నాయి.తాజాగా దేశంలో 43,846 కొత్త కేసులు నమోదయ్యాయి.దీంతో భారత్ లో ఇప్పటి వరకు 1,15,99,130 కేసులు నమోదయ్యాయి.ఇందులో 1,11,30,288 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 3,09,087 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.గడిచిన 24 గంటల్లో భారత్ లో 22,956 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.అయితే, డిశ్చార్జ్ కేసుల కంటే, పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.గడిచిన 24 గంటల్లో భారత్ లో కరోనాతో 197 మంది మృతి చెందారు.ఇప్పటి వరకు దేశంలో 1,59,755 మంది కరోనాతో మృతి చెందినట్టు బులెటిన్ ద్వారా తెలుస్తోంది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ