ఇంగ్లండ్‌ పై టీమిండియా అరుదైన ఘనత...

- March 21, 2021 , by Maagulf
ఇంగ్లండ్‌ పై టీమిండియా అరుదైన ఘనత...

అహ్మదాబాద్:ఇంగ్లండ్‌పై ఆఖరి టీ20లో టీమిండియా అనేక రికార్డులు బద్దలు కొట్టింది. ఇంగ్లాండ్ తో జరిగిన 5 టీ20ల సిరీస్ లో భాగంగా నిన్న జరిగిన చివరి టీ20లో టీమ్‌ఇండియా 36 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన కోహ్లీసేన.. 3-2 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇక ఇదే విజయంతో టీమ్‌ఇండియా.. 2016 టీ20 ప్రపంచకప్‌ తర్వాత ఇంగ్లాండ్ ‌పై మూడుసార్లు పొట్టి సిరీస్‌ కైవసం చేసుకుంది. ఆ జట్టు పై ఈ రికార్డు నమోదు చేసిన తొలి టీమ్‌గా అవతరించింది భారత్‌. ఇంగ్లండ్‌ పై నిన్నటి మ్యాచ్‌లో భారత 224పరుగులు చేసింది. ఇంగ్లండ్‌ పై భారత్‌కు ఇదే అత్యధిక స్కోర్ కూడా‌. అయితే లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 188 పరుగులు మాత్రమే చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com