కోవిడ్ కేసుల కారణంగా సౌదీలో మరో ఏడు మసీదుల మూసివేత
- March 21, 2021
సౌదీ:కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో సౌదీ ప్రభుత్వం..కోవిడ్ కేసులు నమోదవుతున్న మసీదులపై కూడా ఫోకస్ చేసింది. కింగ్డమ్ పరిధిలోని 7 మసీదుల్లో భక్తులకు పాజిటివ్ రావటంతో ఇస్లామిక్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ ఆ ఏడు మసీదులను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. మూసివేసిన మసీదుల్లో మూడు రియాద్లో ఉన్నాయని వెల్లడించింది. అలాగే తూర్పు ప్రావిన్స్, ఉత్తర సరిహద్దులు, నజ్రాన్, ఆసిర్లలో ఒక్కో మసీదు ఉన్నాయని మంత్రిత్వ శాఖ వివరించింది. ఇదిలాఉంటే..వైరస్ కేసులు నమోదవుతుండటంతో గత 41 రోజులలో 326 మసీదులను తాత్కాలికంగా మూసివేసిన విషయం తెలిసిందే. శానిటైజ్ చేసిన తర్వాత 311 మసీదుల్లో ప్రార్థనలు ప్రారంభించారు.
--జయ(మాగల్ఫ్ ప్రతినిధి,సౌదీ అరేబియా)
తాజా వార్తలు
- ఉక్రెయిన్లో శాంతి చర్చల ముందు రష్యా డ్రోన్ దాడి..15 మంది మృతి
- 30వేల మందికి లేఆఫ్స్ ఇవ్వనున్న ఒరాకిల్
- హైదరాబాద్ లో పెరుగుతున్న ఎండలు
- ఇందిరమ్మ ఇళ్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- భారత్తో ఆడొద్దు.. పాక్ ప్రభుత్వ నిర్ణయం పై ఐసీసీ రియాక్షన్ ఇదే
- ఏకైక గ్రౌండ్ హ్యాండ్లింగ్ ప్రొవైడర్గా కువైట్ ఎయిర్వేస్..!!
- సౌదీలో హెయిలింగ్ డ్రైవర్ల కోసం ఫేషియల్ రికగ్నిషన్..!!
- కార్మికులు ఏడాది సర్వీస్ తర్వాత యజమానులను మార్చుకోవచ్చు..!!
- భారత బడ్జెట్ 2026: ఎన్నారై పెట్టుబడులకు ఊతం..!!
- నాగా అల్ సహ్లా స్ట్రీట్ తాత్కాలిక మూసివేత..!!







