కోవిడ్ కేసుల కారణంగా సౌదీలో మరో ఏడు మసీదుల మూసివేత
- March 21, 2021
సౌదీ:కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో సౌదీ ప్రభుత్వం..కోవిడ్ కేసులు నమోదవుతున్న మసీదులపై కూడా ఫోకస్ చేసింది. కింగ్డమ్ పరిధిలోని 7 మసీదుల్లో భక్తులకు పాజిటివ్ రావటంతో ఇస్లామిక్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ ఆ ఏడు మసీదులను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. మూసివేసిన మసీదుల్లో మూడు రియాద్లో ఉన్నాయని వెల్లడించింది. అలాగే తూర్పు ప్రావిన్స్, ఉత్తర సరిహద్దులు, నజ్రాన్, ఆసిర్లలో ఒక్కో మసీదు ఉన్నాయని మంత్రిత్వ శాఖ వివరించింది. ఇదిలాఉంటే..వైరస్ కేసులు నమోదవుతుండటంతో గత 41 రోజులలో 326 మసీదులను తాత్కాలికంగా మూసివేసిన విషయం తెలిసిందే. శానిటైజ్ చేసిన తర్వాత 311 మసీదుల్లో ప్రార్థనలు ప్రారంభించారు.
--జయ(మాగల్ఫ్ ప్రతినిధి,సౌదీ అరేబియా)
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







