తెలంగాణ ఉద్యోగులకు 30శాతం ఫిట్ మెంట్...రిటైర్మెంట్ వయోపరిమితి 61ఏళ్ళు: కేసీఆర్
- March 22, 2021హైదరాబాద్: తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు 30 శాతం ఫిట్మెంట్ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ వయసును 61 సంవత్సరాలకు పెంచుతున్నామని కేసీఆర్ స్పష్టం చేశారు. శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ పీఆర్సీపై ప్రకటన చేశారు. 30 శాతం ఫిట్మెంట్ ఉత్తర్వులు ఏప్రిల్ 1, 2021 నుంచి అమల్లోకి వస్తాయన్నారు. త్వరలోనే ప్రమోషన్ల ప్రక్రియ చేపట్టి.. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామన్నారు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్, హోంగార్డులకు, వీఆర్ఏ, ఆశా వర్కర్లు, అంగన్వాడీలకు కూడా పీఆర్సీ వర్తిస్తుందని సీఎం ప్రకటించారు.
కరోనా వల్ల ఈసారి వేతన సవరణ ఆలస్యమైందన్నారు. ఉద్యోగుల వేతన సవరణ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి చేసుకుంటున్నామని చెప్పారు. పీఆర్సీపై త్రిసభ్య కమిటీ అన్ని ఉద్యోగ సంఘాలతో చర్చించింది. ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర అనిర్వచనీయమైనది అని కొనియాడారు. ఉమ్మడి ఏపీలో టీఎన్జీవో తెగించి పోరాడిందన్నారు. తెలంగాణ సోయిని నిలిపి ఉంచడంలో టీఎన్జీవో స్ఫూర్తి మరువలేనిది అని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- వీసా నిబంధనలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా..
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం