మయన్మార్: మితిమీరిన సైనిక ప్రభుత్వం అరాచకాలు
- March 22, 2021యాంగూన్: మయన్మార్లో సైనిక ప్రభుత్వం అరాచకాలు పెచ్చుమీరుతున్నాయి. ప్రజాస్వామ్యం కోసం ఉద్యమిస్తున్నవారిని కాల్చివేయాలన్న సైనిక ఆదేశాలతో కొందరు పోలీసులు కర్కశంగా వ్యవహరిస్తున్నారు. ద్విచక్రవాహనంపై వెళుతున్న ఓ పౌరుడిని వెంబడించిన పోలీసులు ఎటువంటి వివరాలు అడగకుండానే అతడిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తిని మరికొందరు పోలీసులు వేరే ప్రాంతానికి తరలిస్తున్న దృశ్యాలు ఓ వ్యక్తి సెల్ఫోన్తో చిత్రీకరించారు.
ఈ ఏదాడి ఫిబ్రవరి 1న మయన్మార్ను అదుపులోకి తీసుకున్న ఆ దేశ సైన్యం అరాచక పాలన కొనసాగిస్తోంది. సైన్యం తిరుగుబాటుకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నవారిపై ఉక్కుపాదం మోపుతోంది. విచక్షణారహితంగా కాల్పులు జరుపుతోంది. సైన్యం జరిపిన కాల్పుల్లో వందల సంఖ్యలో మృతిచెందారు. వేల సంఖ్యలో పౌరులు గాయాలపాలయ్యారు. హింసను ఆపాలంటూ ఐక్యరాజ్య సమితి హెచ్చరించినా.. వాటిని పెడచెవిన పెట్టిన సైన్యం హింసకు పాల్పడుతోంది.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు