'తుంటరి' మార్చి 11న వస్తున్నాడు..

- February 29, 2016 , by Maagulf
'తుంటరి' మార్చి 11న వస్తున్నాడు..

 నారా రోహిత్‌, లతా హెగ్డే జంటగా నటించిన 'తుంటరి' చిత్రం మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. కథానాయకుడు నారా రోహిత్‌ సోషల్‌మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలుపుతూ ఓ పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు. కుమార్‌ నాగేంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ కీర్తి ఫిల్మ్స్‌ పతాకంపై అశోక్‌, నాగార్జున్‌లు సంయుక్తంగా నిర్మించారు. సాయి కార్తీక్‌ సంగీతం సమకూర్చారు. 'మన్‌ కరాటే' అనే తమిళ చిత్రాన్ని తెలుగులో 'తుంటరి'గా తెరకెక్కించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com