ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని విద్యాసంస్థలకు నిధులు..

- February 29, 2016 , by Maagulf
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని విద్యాసంస్థలకు నిధులు..

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2016-17 ఆర్థిక సంవత్సరానికి గాను సోమవారం లోక్ సభలో ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్ లో తెలుగు రాష్ట్రల్లోని విద్యా సంస్థలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని కాలేజీలు, యూనివర్సిటీలకు నిధులు కేటాయించారు. వివరాలిలా ఉన్నాయి.సెంట్రల్ యూనివర్సిటీ (ఆంధ్రప్రదేశ్)- కోటి రూపాయలు ట్రైబల్ యూనివర్సిటీ (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ)- రూ. 2 కోట్ల చొప్పున కేటాయింపు ఐఐటీ (తిరుపతి-ఆంధ్రప్రదేశ్)- రూ. 40 కోట్లు ఐఐటీ (హైదరాబాద్)- రూ.20 కోట్లు ఐఐఎమ్ (విశాఖపట్నం-ఆంధ్రప్రదేశ్)- రూ. 30 కోట్లు నిట్ (తాడేపల్లిగూడెం-ఆంధ్రప్రదేశ్)- రూ.40 కోట్లు ఐఐఎస్ఈఆర్ (తిరుపతి-ఆంధ్రప్రదేశ్)- రూ. 40 కోట్లు ట్రిపుల్ ఐటీ (ఆంధ్రప్రదేశ్)- రూ. 20 కోట్లు ఆంధ్రప్రదేశ్ లో పెట్రోలియం యూనివర్సిటీ ఏర్పాటుకు 2 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో పారిశ్రామిక యూనిట్లకు 100 కోట్ల రూపాయల వడ్డీ రాయితీ

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com