మహాత్మా గాంధీ ఐస్ విగ్రహం...కెనడాలో అద్భుతం
- March 22, 2021కెనడాలోని ఓ ప్రముఖ హోటల్ వద్ద భారత జాతిపిత గాంధీజీ ఐస్ విగ్రహం ఏర్పాటైంది. రానున్న ఆగస్టు 15 న ఇండియా 75 వ స్వాతంత్య్ర దినోత్సవాలను జరుపుకోనుంది. దీన్ని పురస్కరించుకుని క్యూబెక్ సిటీలోని ఈ హోటల్ ఆవరణలో ఏడు అడుగుల ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని నెలకొల్పారు. ఇది పూర్తిగా ఐస్ తో తయారవడం విశేషం. మార్క్ లీ పెయిర్ అనే ఐస్ ఆర్టిస్టు ఈ విగ్రహాన్ని రూపొందించాడు. టొరంటో లోని భారత దౌత్య కార్యాలయం ఈ విగ్రహ ఇమేజీని తమ అధికారిక ట్విటర్ లో షేర్ చేస్తూ లాంచింగ్ ఆజాదీకా అమృత్ మహోత్సవ్ అంటూ పేర్కొంది. ఈ సందర్భంగా ఈ విగ్రహావిష్కరణ గురించి వివరించింది. 75 ఏళ్ళ భారత స్వాతంత్య్ర ఉత్సవాల నేపథ్యంలో ప్రధాని మోదీ మార్చి 12 న ఆజాదీకా అమృత్ మహోత్సవ్ ని లాంచ్ చేశారు. ఇప్పుడు కెనడా మన ఇండియాతో బాటు గాంధీజీకి గౌరవ పురస్కరంగా ఈ విగ్రహాన్ని ఈ హోటల్ వద్ద ఏర్పాటు చేసినట్టు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్లైన్స్
- స్పామ్ కాల్స్కు ఇక గుడ్బై..
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ