కువైట్ ముసాఫిర్ రిజిస్ట్రేషన్: దౌత్యవేత్తలకు మినహాయింపు
- March 23, 2021కువైట్:కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అన్ని విమాన యాన సంస్థలూ తప్పనిసరిగా తాజా గౌడ్ లైన్స్ పాటించాలంటూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) స్పష్టం చేసింది. ఈ తాజా గైడ్ లైన్స్లో దౌత్య సంబంధిత కార్యక్రమాల నిమిత్తం వచ్చేవారు అలాగే అధికారిక పర్యటనల నిమిత్తం కువైట్ వచ్చేవారికి కువైటిమోసాఫెర్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడంపై మినహాయింపు ఇచ్చారు. కాగా, కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకునే ప్రతి ఒక్కరూ పీసీఆర్ టెస్ట్ నెగెటివ్ సర్టిఫికెట్ తమతోపాటు తీసుకురావాల్సి వుంటుంది. టెస్ట్ జరిగిన 72 గంటల్లోపు ఫలితాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. జలుబు, జ్వరం, దగ్గు, తుమ్ములు వంటి లక్షణాల్ని ప్రయాణీకులు కలిగి వుండకూడదు. కాగా, కువైట్ వచ్చే ప్రతి ఒక్కరికీ వచ్చిన వెంటనే పిసిఆర్ టెస్ట్ నిర్వమించనుంది కువైట్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు