రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

- March 23, 2021 , by Maagulf
రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

సౌదీ అరేబియా: సౌదీ అరేబియాలోని నఖాల్ గవర్నరేట్ పరిధిలో ఓ రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా ఇద్దరు గాయాల పాలయ్యారు. ప్రమాదం గురించిన సమాచారం అందుకోగానే ఐదు అంబులెన్స్ బృందాలు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు ముమ్మరం చేశాయి. రెడ్ క్రిసెంట్, సివిల్ డిఫెన్స్, హెల్త్ బృందాలు బాధితులకు సహాయాన్ని అందించాయి. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com