అంతర్జాతీయ విమాన సర్వీసులపై భారత్ కీలక నిర్ణయం

- March 23, 2021 , by Maagulf
అంతర్జాతీయ విమాన సర్వీసులపై భారత్ కీలక నిర్ణయం

న్యూ ఢిల్లీ:అంతర్జాతీయ విమాన సర్వీసుల రద్దును ఏప్రిల్ 30వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు  డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (DGCA) అధికారులు తెలిపారు.కరోనా పంజా విసరడంతో.. విమాన సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి.. కేవలం ప్రభుత్వ అవసరాల కోసమే వినియోగించారు.. ఆ తర్వాత విదేశాల్లో చిక్కుకున్నవారిని స్వదేశానికి రప్పించడానికి ప్రత్యేక విమానాలు నడిపారు.. అలా దేశీయ విమానసర్వీసులకు అనుమతి ఇచ్చారు.. కానీ, కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో గత ఏడాది మార్చి 23 నుంచి షెడ్యూల్డు అంతర్జాతీ విమాన సర్వీసులు మాత్రం నిలిపివేసింది కేంద్రం.. మరోసారి కోవిడ్ కేసులు పెరుగుతూ ఆందోళన కలిగిస్తున్న తరుణంలో.. అంతర్జాతీయ కమర్షియల్ ప్యాసింజర్ విమానల నిలిపివేతను పొడిగిస్తున్నట్టు DGCA వెల్లడించింది.. అయితే, అవసరాలకు అనుగుణంగా.. ఎంపిక చేసిన మార్గాల్లో అంతర్జాతీయ విమాన సర్వీసులకు అనుమతి ఇచ్చే అవకాశం ఉందని పేర్కొంది. కానీ, ఇంటర్నేషనల్ ఆల్ కార్గో ఆపరేషన్స్, విమానాలకు ఈ ఆంక్షలు వర్తించబోవని DGCA స్పష్టం చేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com