అంతర్జాతీయ విమాన సర్వీసులపై భారత్ కీలక నిర్ణయం
- March 23, 2021
న్యూ ఢిల్లీ:అంతర్జాతీయ విమాన సర్వీసుల రద్దును ఏప్రిల్ 30వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) అధికారులు తెలిపారు.కరోనా పంజా విసరడంతో.. విమాన సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి.. కేవలం ప్రభుత్వ అవసరాల కోసమే వినియోగించారు.. ఆ తర్వాత విదేశాల్లో చిక్కుకున్నవారిని స్వదేశానికి రప్పించడానికి ప్రత్యేక విమానాలు నడిపారు.. అలా దేశీయ విమానసర్వీసులకు అనుమతి ఇచ్చారు.. కానీ, కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో గత ఏడాది మార్చి 23 నుంచి షెడ్యూల్డు అంతర్జాతీ విమాన సర్వీసులు మాత్రం నిలిపివేసింది కేంద్రం.. మరోసారి కోవిడ్ కేసులు పెరుగుతూ ఆందోళన కలిగిస్తున్న తరుణంలో.. అంతర్జాతీయ కమర్షియల్ ప్యాసింజర్ విమానల నిలిపివేతను పొడిగిస్తున్నట్టు DGCA వెల్లడించింది.. అయితే, అవసరాలకు అనుగుణంగా.. ఎంపిక చేసిన మార్గాల్లో అంతర్జాతీయ విమాన సర్వీసులకు అనుమతి ఇచ్చే అవకాశం ఉందని పేర్కొంది. కానీ, ఇంటర్నేషనల్ ఆల్ కార్గో ఆపరేషన్స్, విమానాలకు ఈ ఆంక్షలు వర్తించబోవని DGCA స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- విక్రమ్ 1 దేశంలోనే తొలి ప్రైవేట్ రాకెట్..జెండా ఊపి ప్రారంభించిన సీఎం రేవంత్
- కువైట్ ఎయిర్వేస్ 13 గమ్యస్థానాలకు 35 విమాన సర్వీసులు పునఃప్రారంభం
- IPL 2026: రాజస్తాన్ పై హైదరాబాద్ ఘన విజయం
- ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్: మెట్రో నగరాలకే కాదు..విజయవాడకు పాకిన ఏఐ విప్లవం
- IPL 2026: DC పై పంజాబ్ ఘనవిజయం
- ఏపీలో సెగలు పుట్టిస్తున్న ఎండలు..
- నీతిఆయోగ్ నూతన వైస్ ఛైర్మన్ గా అశోక్ కుమార్
- ఎన్టీఆర్ లెజెండరీ అవార్డ్స్ పోస్టర్ను ఆవిష్కరించిన దగ్గుబాటి పురందేశ్వరి
- ఒమన్ లో 40 మంది అరెస్టు..!!
- యూఏఈలో పెట్రోల్ ధరలు పెరుగుతాయా? Dh4 మార్కును తాకుతాయా?









