అంతర్జాతీయ విమాన సర్వీసులపై భారత్ కీలక నిర్ణయం
- March 23, 2021_1616515534.jpg)
న్యూ ఢిల్లీ:అంతర్జాతీయ విమాన సర్వీసుల రద్దును ఏప్రిల్ 30వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) అధికారులు తెలిపారు.కరోనా పంజా విసరడంతో.. విమాన సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి.. కేవలం ప్రభుత్వ అవసరాల కోసమే వినియోగించారు.. ఆ తర్వాత విదేశాల్లో చిక్కుకున్నవారిని స్వదేశానికి రప్పించడానికి ప్రత్యేక విమానాలు నడిపారు.. అలా దేశీయ విమానసర్వీసులకు అనుమతి ఇచ్చారు.. కానీ, కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో గత ఏడాది మార్చి 23 నుంచి షెడ్యూల్డు అంతర్జాతీ విమాన సర్వీసులు మాత్రం నిలిపివేసింది కేంద్రం.. మరోసారి కోవిడ్ కేసులు పెరుగుతూ ఆందోళన కలిగిస్తున్న తరుణంలో.. అంతర్జాతీయ కమర్షియల్ ప్యాసింజర్ విమానల నిలిపివేతను పొడిగిస్తున్నట్టు DGCA వెల్లడించింది.. అయితే, అవసరాలకు అనుగుణంగా.. ఎంపిక చేసిన మార్గాల్లో అంతర్జాతీయ విమాన సర్వీసులకు అనుమతి ఇచ్చే అవకాశం ఉందని పేర్కొంది. కానీ, ఇంటర్నేషనల్ ఆల్ కార్గో ఆపరేషన్స్, విమానాలకు ఈ ఆంక్షలు వర్తించబోవని DGCA స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి