మూడేళ్ల కాంట్రాక్ట్ ప్రతిపాదికన ప్రభుత్వ ఉన్నతాధికారులకు విధులు
- March 24, 2021
దుబాయ్:మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు పని విధాలను మరింత మెరుగుపర్చుకోవటం..ప్రభుత్వ శాఖలన్ని మరింత సరళతరంగా ప్రజలకు సేవలను అందించటమే లక్ష్యంగా దుబాయ్ పాలనా యంత్రాంగం తమ విభాగాలను పునర్నిర్మించుకుంటోంది. ఇందులో భాగంగా అన్ని ప్రభుత్వ విభాగాల్లోని ఉన్నతాధికారులు, డైరెక్టర్లకు మూడేళ్ల కాంట్రాక్ట్ ప్రతిపాదికన విధులను అప్పగిస్తోంది. ఈ కాంట్రాక్ట్ కాలంలో ఉన్నతాధికారుల సమర్ధతను, విధుల నిర్వహణను బేరీజు వేసుకొని అందుకు తగినట్లుగా ప్రొత్సహాకాలను ఇవ్వనుంది. ప్రభుత్వ విభాగాల్లో జవాబుదారీతనం, సమర్ధనీయత, సరళతర సేవల కోసమే ఈ మార్పులు చేపట్టినట్లు దుబాయ్ పాలకుడు హిజ్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ వెల్లడించారు. జీవిత గమనంలో గత విజయాలను మాత్రమే నెమరేసుకుంటూ ఉండేవారికి భవిష్యత్తు ఉండదని, అలాంటి వారి భవిష్యత్తు తిరోగమనంలో ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఉజ్వల భవిష్యత్తు ఆకాంక్షలతో దుబాయ్ అడుగులు వేస్తోందని, అదే సంకల్పంతో ముందుకు పయనిస్తామని, ఆ తర్వాత మంచి ఫలితాలు మన కళ్ల ముందు కనిపిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- IPL 2026: DC పై పంజాబ్ ఘనవిజయం
- ఏపీలో సెగలు పుట్టిస్తున్న ఎండలు..
- నీతిఆయోగ్ నూతన వైస్ ఛైర్మన్ గా అశోక్ కుమార్
- ఎన్టీఆర్ లెజెండరీ అవార్డ్స్ పోస్టర్ను ఆవిష్కరించిన దగ్గుబాటి పురందేశ్వరి
- ఒమన్ లో 40 మంది అరెస్టు..!!
- యూఏఈలో పెట్రోల్ ధరలు పెరుగుతాయా? Dh4 మార్కును తాకుతాయా?
- కువైట్ ఎయిర్పోర్ట్ T5 నుండి డైరెక్ట్ ఫ్లైట్స్.. జజీరా ఎయిర్వేస్
- ఖతార్ లో కమ్యూనిటీ రన్నింగ్ సెషన్లు ప్రారంభం..!!
- సంస్కరణల దిశగా రిమోట్ వర్క్.. పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆమోదం..!!
- సాక్ష్యంగా ఈమెయిల్.. BHD11,000 దావా కొట్టివేత..!!









