మూడేళ్ల కాంట్రాక్ట్ ప్రతిపాదికన ప్రభుత్వ ఉన్నతాధికారులకు విధులు
- March 24, 2021
దుబాయ్:మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు పని విధాలను మరింత మెరుగుపర్చుకోవటం..ప్రభుత్వ శాఖలన్ని మరింత సరళతరంగా ప్రజలకు సేవలను అందించటమే లక్ష్యంగా దుబాయ్ పాలనా యంత్రాంగం తమ విభాగాలను పునర్నిర్మించుకుంటోంది. ఇందులో భాగంగా అన్ని ప్రభుత్వ విభాగాల్లోని ఉన్నతాధికారులు, డైరెక్టర్లకు మూడేళ్ల కాంట్రాక్ట్ ప్రతిపాదికన విధులను అప్పగిస్తోంది. ఈ కాంట్రాక్ట్ కాలంలో ఉన్నతాధికారుల సమర్ధతను, విధుల నిర్వహణను బేరీజు వేసుకొని అందుకు తగినట్లుగా ప్రొత్సహాకాలను ఇవ్వనుంది. ప్రభుత్వ విభాగాల్లో జవాబుదారీతనం, సమర్ధనీయత, సరళతర సేవల కోసమే ఈ మార్పులు చేపట్టినట్లు దుబాయ్ పాలకుడు హిజ్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ వెల్లడించారు. జీవిత గమనంలో గత విజయాలను మాత్రమే నెమరేసుకుంటూ ఉండేవారికి భవిష్యత్తు ఉండదని, అలాంటి వారి భవిష్యత్తు తిరోగమనంలో ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఉజ్వల భవిష్యత్తు ఆకాంక్షలతో దుబాయ్ అడుగులు వేస్తోందని, అదే సంకల్పంతో ముందుకు పయనిస్తామని, ఆ తర్వాత మంచి ఫలితాలు మన కళ్ల ముందు కనిపిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ఎంపీ సంతోష్ రావు పై కవిత సంచలన వ్యాఖ్యలు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన లోక్ సభాపక్షనేత బాలశౌరి
- ఏపీ: ఎట్టకేలకు కొత్త బైపాస్ ప్రారంభం..త్వరలోనే మరొకటి!
- ఖతార్తో సంబంధాలు మరింత బలోపేతం: అజయ్ బంగా
- ఇండియా-సౌదీ అరేబియా భాగస్వామ్యం బలోపేతం..!!
- భారత రూపాయి పతనానికి బ్రేక్ పడుతుందా?
- షద్దాదియాలో ప్రవాస కార్మికుల హౌజింగ్ కు స్థలాలు..!!
- ఒమన్లో కార్మికులకు అండగా కొత్త నిబంధనలు..!!
- మద్యం సేవించి డ్రైవింగ్..యాక్సిడెంట్ లో యువతి మృతి..!!
- కొత్త సాఫ్ట్ వేర్తో బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ







