కర్ఫ్యూ టైంలో నడకకు మాత్రమే అనుమతి..వాహనాలకు నో పర్మిషన్
- March 24, 2021
కువైట్:కోవిడ్ వ్యాప్తి నియంత్రణ కోసం పాక్షిక కర్ఫ్యూ విధిస్తూ కువైట్ మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాలను తూచ తప్పకుండా అమలు చేస్తామని పరిపాలనా, భద్రత వ్యవహారాల డైరెక్టర్ జనరల్ పేర్కొన్నారు. గతంలో సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉండగా..మంత్రివర్గం తీసుకున్న కొత్త నిర్ణయం మేరకు కర్ఫ్యూ సమయంలో ఓ గంట తగ్గింది. అంటే సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉండనుందని ఆయన అన్నారు. అయితే..కర్ఫ్యూ సమయంలో సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నివాస ప్రాంతంలో వాకింగ్ కు వెళ్లవచ్చని స్పష్టం చేశారు. వాకింగ్ కు వెళ్లేవారు ఖచ్చితంగా భౌతిక దూరం పాటించాలని, ఫేస్ మాస్క్ పెట్టుకోవాలన్నారు. లేదంటే కోవిడ్ నిబంధనల ఉల్లంఘన కింద చట్టారిత్యా చర్యలు తీసుకుంమని ఆయన హెచ్చరించారు. అయితే..కర్ఫ్యూ సమయంలో కేవలం వాకింగ్ కు మాత్రమే వెసులుబాటు ఉందన్న విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని, ఎలాంటి వాహనాలకు అనుమతి లేదని ఆయన అన్నారు. వాకింగ్ కు కేటాయించిన సమయంలో ఎవరైనా వాహనాలతో బయటికి వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
తాజా వార్తలు
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల
- డ్రగ్స్ కేసుల్లో చిక్కుకున్న విదేశీయులను వెనక్కి పంపనున్న కేంద్రం
- టీటీడీ ఈవోకు శుభాకాంక్షలు తెలిపిన టిటిడి పాలక మండలి