భారత్ లో కరోనా కేసుల వివరాలు

- March 24, 2021 , by Maagulf
భారత్ లో కరోనా కేసుల వివరాలు

న్యూ ఢిల్లీ: భారత్ లో మహమ్మారి కేసులు పెరుగుతున్నాయి.  రోజు రోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో పాటుగా మరణాల సంఖ్య కూడా పెరుగుతున్నాయి.తాజాగా కేంద్రం కరోనా బులెటిన్ ను విడుదల చేసింది.ఈ బులెటిన్ ప్రకారం, దేశంలో కొత్తగా 47,262 కేసులు నమోదయ్యాయి.దీంతో భారత్ లో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,17,34,058కి చేరింది.ఇందులో 1,12,05,160 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా,3,68,467 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.ఇక గడిచిన 24 గంటల్లో 275 మంది మృతి చెందారు.దీంతో భారత్ లోఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,60,441 కి చేరింది.ఇక గడిచిన 24 గంటల్లో భారత్ లో 23,907 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.డిశ్చార్జ్ కేసుల కంటే పాజిటివ్ కేసులు డబుల్ గా నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com