అక్రమ భూ వినియోగానికి జరీమానా
- February 29, 2016
అబుదాబీ సిటీ మునిసిపాలిటీ, అల్ వత్బా మున్సిపల్ సెంటర్ అవగాహనా కార్యక్రమాన్ని ప్రారంభించింది. పారిశ్రామిక అవసరాల కోసం కేటాయించిన భూమిని సద్వినియోగం చేయకపోవడం, దుర్వినియోగానికి పాల్పడటం, అలాగే ఎన్విరాన్మెంటల్ స్టాండర్డ్స్ని తుంగలో తొక్కడం వంటివాటి విషయమై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం తాలూకు ఉద్దేశ్యం. అమల్లో ఉన్న టెనెన్సీ అగ్రిమెంట్లను రిన్యూ చేయడం, అలాగే ఇండస్ట్రియల్ ల్యాండ్స్కి చెందిన అద్దె బాకీలను వసూలు చేయడం ఇవన్నీ ఇందులోని ముఖ్యమైన అంశాలుగా అధికారులు వివరించారు. నిబంధనల్ని అతిక్రమించిన వారికి చట్టాలకు అనుగుణంగా జరీమానాలు విధించబడ్తాయ వారు చెప్పారు. ఆర్టికల్ 17 ప్రకారం నిబంధనల్ని ఉల్లంఘించినవారికి 30,000 దిర్హామ్ల ఫైన్ విధించడంతోపాటు, అతిక్రమణల్ని తొలగించడం జరుగుతుంది. ఆర్టికల్ 18 ప్రకారం నిబంధనల్ని ఉల్లంఘిస్తే 20,000 దిర్హామ్ల జరీమానాతోపాటు, అక్రమంగా ఉన్న మెటీరియల్ని తొలగిస్తారు. మానిటరింగ్ మరియు ఇన్స్పెక్షన్ డైరెక్టర్ సయీద్ అలి అల్ హజ్రి మాట్లాడుతూ, నిబంధనల్ని అతిక్రమించినవారు నోటీసులు అందుకున్న 30 రోజుల్లోపు, తమ తప్పుల్ని సరిదిద్దుకోవాల్సి ఉంటుందనీ, అలాగే 50 శాతం ఫైన్ని చెల్లించవలసి ఉంటుందని చెప్పారు. 30 రోజుల్లోపు స్పందించని పక్షంలో పబ్లిక్ ప్రాసిక్యూషన్కి రిఫర్ చేయబడటం, అలాగే జ్యుడీషియల్ అథారిటీస్ తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







