రెసిడెన్సీ పర్మిట్లు కోల్పోయిన 200,000 మందికి పైగా వలసదారులు

- March 24, 2021 , by Maagulf
రెసిడెన్సీ పర్మిట్లు కోల్పోయిన 200,000 మందికి పైగా వలసదారులు

కువైట్: కువైట్‌కి చెందిన 200,000 మంది వలసదారులు తమ రెసిడెన్సీస్‌ని గడచిన ఏడాదిలో కోల్పోయారు. కరోనా వైరస్ కారణంగా వీరంతా కువైట్ వెలుపల చిక్కుకుపోయారు. కరోనా పాండమిక్ మొదలయ్యాక ప్రభుత్వం వలసదారుల విషయమై కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆరు నెలలపాటు దేశం వెలుపల వుంటే వారి రెసిడెన్సీ సర్టిఫికెట్ చెల్లకుండా పోతుంది మామూలుగా అయితే. ఈ నిర్ణయాన్ని కరోనా నేపథ్యంలో తాత్కాలికంగా పక్కన పెట్టింది కువైట్ ప్రభుత్వం. 20 దేశాలకు చెందిన వలసదారులు కోవిడ్ కారణంగా రెసిడెన్సీ సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. వీరిలో ఈజిప్టు, ఇండియా మరియు శ్రీలంక దేశాలకు చెందినవారు ఎక్కువగా వున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com