కోవిడ్ రూల్స్ బ్రేక్..318 మందిపై కేసులు నమోదు

- March 25, 2021 , by Maagulf
కోవిడ్ రూల్స్ బ్రేక్..318 మందిపై కేసులు నమోదు

ఖతార్: కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన 335 మందిపై చర్యలు తీసుకున్నట్లు ఖతార్ అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఉల్లంఘునుల్లో కొందర్ని హెచ్చరించి వదిలేయగా..318 మందిపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. కేసులు నమోదైన వారిలో ఆరుగురు భౌతిక దూరం పాటించలేదని, 11 మంది హెతీహాద్ యాప్ ఇన్ స్టాల్ చేసుకోవటం విఫలం అయ్యారని వివరించారు. కేసులు నమోదైన వారిలో ఎక్కువ మంది పబ్లిక్ ప్రాంతాల్లో ఫేస్ మాస్కులు ధరించని వారే ఉన్నారని అన్నారు. ఉల్లంఘునులు అందర్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు తరలించినట్లు వెల్లడించారు. వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించి తీరాలని...ప్రతి ఒక్కరు బాధ్యయుతంగా నడుచుకోవాలని సూచించారు. కోవిడ్ నిబంధనలు పాటించని వారిపై చట్టరిత్య చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com